
బంగ్లాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి.అక్కడి అవామీ లీగ్ పార్టీని నిషేధిస్తూ బంగ్లా ప్రభుత్వం గెటిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అంటే అవామీ పార్టీ , ఆ పార్టీలో నాయకులపై ప్రత్యేక ట్రిబ్యునల్ విచారణ పూర్తయ్యేవరకు నిషేధం కొనసాగుతుంది. దాంతో అవామీ లీగ్ పార్టీ లీడర్స్ ఆగమాగం అవుతున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి భారత్ లో తలదాచుకన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మాజీ అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయాడని బంగ్లాలో ప్రచారం మొదలైంది. తెల్లవారు జామున 3 గంటలకు మాజీ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ థాయ్ ల్యాండ్ విమానం ఎక్కి పారిపోయినట్లు తెలుస్తోంది.
దీంతో బంగ్లా ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. తన కుటుంబ సభ్యులతో కలసి 81 ఏళ్ల హమీద్ ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి థాయ్ ఎయిర్ వేస్ విమానాం ఎక్కినట్లు సీసీఫూటేజీ బయటపెట్టింది. యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అవామీ లీగ్ నాయకులపై దాడులు ప్రారంభమయ్యాయి. హత్యా ఆరోపణలపై దర్యాప్తు మొదలైంది. ఈ క్రమంలోనే హమీద్ పై హత్య కేసు నమోదింది. దీంతో కొంత కాలంగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు మాజీ అధ్యక్షులు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఎవరికి అనుమానం రాకుండా లుంగీలో ఢాకా విమానాశ్రయం నుంచి థాయ్ ఎయిర్ వేస్ విమానం ఎక్కేసారు హమీద్. ఈ వ్యవహారం పై సీరియస్ గా ఉన్న బంగ్లా ప్రభుత్వం పలువురు అధికారులను సస్పెండ్ చేసింది. కాగా హమీద్ వైద్య