త్వరలో బిహార్ లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి నితీష్ కుమార్ ను, సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు, అక్కడి కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. అయితే నితీష్ ఆరోగ్యం ఎంతవరకు సహకరిస్తుంది అనేది ప్రత్యర్థ పార్టీలకు సందేహిస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనుకుంటున్నాయి.

ఇప్పటికే ఎన్నికల వ్యహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ సుపరి పాలన అందిస్తామంటూ ప్రచారంలో దూసుకుపోతోంది. ఈసారి ప్రశాంత్ పార్టీ బిహార్ లో మిగితా పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇక ఇటీవలే కాంగ్రెస్ మాజీ నేత గుప్తా …పట్నాలోని గాంధీ మైదాన్ లో భారీ సభ నిర్వహించి ఇండియన్ ఇంక్విలాబ్ అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.

బిహార్ లో అత్యంత వెనుకబడిన రెండు కులాల ఓట్లపై ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు. అటు ప్రశాంత్ కిషోర్ పార్టీ అయినా, గుప్తా పెట్టిన పార్టీ అయినా, ఎక్కువ స్థానాలను గెల్చుకోకపోయినా, ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓట్లను వీరు చీల్చే అవకాశం ఉంది. ఇక శివ్ దీప్ లాండే నేతృత్వంలోని హింద్ సేన కూడా ఈసారి ఎన్నికల క్షేత్రంలోకి బలంగానే దిగుతోంది.

ఆర్ సీపీ సింగ్ ఒకప్పుడు నితీష్ కు సన్నిహితంగా వెలిగారు. ఇప్పుడు ఆప్ సబ్ కీ ఆవాజ్ పేరుతో సొంత పార్టీని నడుపుతున్నారు. కుర్మీల నేతగా రాబోయే ఎన్నికల్లో చక్రం తిప్పుతానంటున్నారు.

కాంగ్రెస్, వామపక్షాలు, వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీలతో కలసి బలమైన కూటమి మారేందుకు ఆర్జేడీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. బిహార్ లో కుల రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో చాలా కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఎందరు వచ్చినా, ఎవరు ఎవరితో చేతులు కలిపినా, భాజపా, జేడీయు కూటమిదే పై చేయి అని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా కొత్త పార్టీల రాకతో రాబోయే ఎన్నికలు హోరా హోరీగా జరిగే అవకాశాలు ఉన్నాయి.

error: Content is protected !!