
చైనాకు చెందిన ప్రముఖ ప్రముఖ విద్యుత్ వాహనాల సంస్థ బీవైడీ ( #BYD ), భారత్ మార్కెట్ లో పట్టు బిగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా భారత్ లోనూ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో కు హాజరైన బీవైడీ భారత్ విభాగం బిజినెస్ హెడ్ రాజీవ్ చౌహాన్ ఈ విషయాన్ని వెల్లడించారు.

భారత మార్కెట్ లోకి 25 నుంచి 45 లక్షల ధరలో ఉన్న ఈవీ కార్లను తీసుకురావాలని నిర్ణయించినట్లు చౌహాన్ తెలిపారు. బీవైడీ ప్రధానంగా 20 -25 లక్షలు, అలాగే 40 – 45 లక్షల ధరలో ఉన్న ఈవీ కార్లను భారత్ మార్కెట్ లో తీసుకురానుంది. ఇటీవల జరిగిన ఎక్స్ పోలో ఎలక్ట్రిక్ సీలయన్ 7 కారును కంపెనీ భారత్ మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ఈ కారు బుకింగ్స్ ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం అవుతాయని కంపెనీ చెప్పుకొచ్చింది. ఈ కారు ధర 40 నుంచి 45 లక్షల మధ్యలో ఉంటుందట. గత ఏడాది బీవైడీ ఇండియా భారత్ లో 3500 వాహనాలను విక్రయించింది. కాగా ఈ ఏడాది అమ్మకాలు మరింత పెరగనున్నాయని కంపెనీ ఆశిస్తోంది.


- 70 ఏళ్ల హీరో, 40 ఏళ్ల హీరోయిన్స్, ఏంటి ఈ రొమాన్స్..నాన్సెన్స్!
- ఏకంగా పవన్ సినిమా పైనే కుట్ర, టాలీవుడ్ లో అసలు ఏం జరుగుతోంది? ( సంచలనం)
- అటు పెద్ది, ఇటు దేవర, అదిరిపోయిన ఫోటో వార్
- మీరు మెగా ఫ్యాన్స్.. అయితే ఇదిగో గుడ్ న్యూస్
- సీక్వెల్స్ క్రేజ్ నాశనం చేయకండి, బన్ని లేకుండా ఆర్య-3 వద్దే వద్దండి!
- వార్ -2 టీజర్ : ఎన్టీఆర్ ను నరకానికి స్వాగతించిన హృతిక్ రోషన్
- కాంతార -2 విడుదల ఇప్పట్లో కష్టమేనా?
- షారుఖ్ కోసం ప్రభాస్ను వద్దనుకున్న దీపిక?
- ఎన్ని బయోపిక్స్ లో నటిస్తావ్ ధనుష్? మొన్న ఇళయరాజా, నేడు కలాం
- స్పిరిట్ నుంచి దీపిక్ ఔట్, నేషన్ క్రష్ ఇన్?