
చైనాకు చెందిన ప్రముఖ ప్రముఖ విద్యుత్ వాహనాల సంస్థ బీవైడీ ( #BYD ), భారత్ మార్కెట్ లో పట్టు బిగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా భారత్ లోనూ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో కు హాజరైన బీవైడీ భారత్ విభాగం బిజినెస్ హెడ్ రాజీవ్ చౌహాన్ ఈ విషయాన్ని వెల్లడించారు.

భారత మార్కెట్ లోకి 25 నుంచి 45 లక్షల ధరలో ఉన్న ఈవీ కార్లను తీసుకురావాలని నిర్ణయించినట్లు చౌహాన్ తెలిపారు. బీవైడీ ప్రధానంగా 20 -25 లక్షలు, అలాగే 40 – 45 లక్షల ధరలో ఉన్న ఈవీ కార్లను భారత్ మార్కెట్ లో తీసుకురానుంది. ఇటీవల జరిగిన ఎక్స్ పోలో ఎలక్ట్రిక్ సీలయన్ 7 కారును కంపెనీ భారత్ మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ఈ కారు బుకింగ్స్ ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం అవుతాయని కంపెనీ చెప్పుకొచ్చింది. ఈ కారు ధర 40 నుంచి 45 లక్షల మధ్యలో ఉంటుందట. గత ఏడాది బీవైడీ ఇండియా భారత్ లో 3500 వాహనాలను విక్రయించింది. కాగా ఈ ఏడాది అమ్మకాలు మరింత పెరగనున్నాయని కంపెనీ ఆశిస్తోంది.


- రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణకు ముహూర్తం ఖరారు
- జై అఖండ ఉంటుందా..? ఉంటుందంటోన్న జై బాలయ్య!
- మార్చిలో రిలీజైన చిత్రానికి , ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పడం ఏంటి బన్ని?
- ఏం టైటిల్ ఇది త్రివిక్రమ్? మరీ ఇంత పిరికితనమా?
- వారం గ్యాప్లో బాబాయ్,అబ్బాయ్ బాక్సాఫీస్ దాడి?
- ఖైదీ సీక్వెల్ … కార్తికి ఇంట్రెస్ట్ పోయింది!
- సరిగ్గా వారం తర్వాత అఖండ ఆగమనం, రిలీజ్కు లైన్ క్లియర్
- పవన్ చేసిన సాయం, మరిచిన నిర్మాత ఏ.ఎం.రత్నం?
- నరసింహ సీక్వెల్, నెరవేరుతున్న రజనీకాంత్ 50 ఏళ్ల కల
- రిలీజ్ కు గంట ముందు అఖండ -2 పోస్ట్ పోన్
