
తెలంగాణ తెచ్చిన యోధుడు, తెలంగాణ ను పదేళ్లు పాలించిన ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ పార్టీ ఆధినేత కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొలిటికల్ యాక్టివిటీని తగ్గించేశారు. చాలా వరకు ఫామ్ హౌజ్ కు పరిమితం అవుతున్నారు. అయితే ఈ విరామ సమయంలో కేసీఆర్ స్వయంగా సెల్ ఫోన్ ను ఆపరేట్ చేయడం, నెంబర్లను సేవ్ చేయడం లాంటిని నేర్చుకున్నారట. ఇందుకోసం కేసీఆర్ ఆయన మనవడు హిమాన్షు సహాయం తీసుకున్నారట. ఏంటి వినడానికి విచిత్రంగా ఉందా, మాజీ సీఎం కేసీఆర్ కు ఫోన్ వాడటం రాదా అని ఆశ్చర్యపోతున్నారా.. అనునండీ నిజం. మొన్నటి వరకు ఎవరితో మాట్లాడాలి అనుకున్నా.. ఫోన్ నెంబర్ కలిపి ఇవ్వు మాట్లాడుతా అంటూ కుటుంబ సభ్యులు, తన వద్ద ఉన్న సిబ్బంది, వెంట ఉండేవారిని కేసీఆర్ అడిగేవారట. ఇప్పుడు సొంతంగా ఫోన్ వాడటం నేర్చుకున్నారట. కేటీఆర్, హరీష్ రావు, కవితలకతో పాటు మరికొంత మందికి తాను ఎప్పుడంటే అప్పుడు ఫోన్ కలుపుతున్నారట.