పాన్ ఇండియా ట్రెండ్, చాలా మంది హిందీ నటీ నటులు, ఇప్పుడు టాలీవుడ్ కు వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లో, ఛావా విలన్, ఆ చిత్రంలో మోఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రధారి అక్షయ్ ఖన్నా కూడా చేరిపోయాడు. ఒకప్పుడు బాలీవుడ్ లో హీరోగా వెలిగాడు అక్షయ్. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తూ వచ్చాడు. ఛావాతో పవర్ ఫుల్ విలన్ గా మారాడు. దేశ వ్యాప్తంగా తన నటనకు ప్రశంసలు అందుకున్నాడు. అంతటి నటుడు ఇప్పుడు టాలీవుడ్ బాట పట్టాడు.

హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తనకంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాడు. అందులో భాగంగా మహాకాళి అనే పేరుతో మూవీని నిర్మించబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభమైంది. మార్టిన్ లుథర్ కింగ్ చిత్రాన్ని తెరకెక్కించిన పూజ కొల్లూరు మహాకాళిని తెరకెక్కించబోతోంది. ఈ చిత్రంలోనే అక్షయ్ ఖన్నా కీలక పాత్రలో నటించబోతున్నాడు. అయితే మహాకాళి పాత్రలో ఎవరు నటించబోతున్నారు అనేది ప్రశాంత్ వర్మ ఇంతవరకు అయితే రివీల్ చేయలేదు.

హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ వర్మ ఆ తర్వాత  బాలీవు్డ లో రణవీర్ సింగ్ తోనూ, బాలయ్య గారి అబ్బాయ్ మోక్షజ్ఞతోనూ చిత్రాలు చేయాలనుకున్నాడు. కాని కుదరలేదు. దీంతో ప్రస్తుతం ప్రభాస్ కోసం సినిమా కథను సిద్దం చేస్తున్నాడని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. మహాభారతంలో బకాసురుడు పాత్ర నేపథ్యంలో కథను రాసుకుని, ఆ చిత్రాన్ని ప్రభాస్ తో తెరకెక్కిస్తాడట ప్రశాంత్. ఇక జై హనుమాన్ త్వరలోనే తెరకెక్కనుంది.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!