
అప్పుడు రజనీకాంత్ అన్నారు.. ఇప్పుడు రామ్ చరణ్ అంటున్నారు.. పైగా సేమ్ టు సేమ్ అంటున్నారు.. అంటే సూపర్ స్టార్ జీవితంలో జరిగిందే , మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్ జీవితంలోనూ రిపీటైందా..అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.అది ఎలా అంటే గతంలో రజనీకాంత్ నటించిన బాషా చిత్రాన్ని సంగీత దర్శకుడు ఎన్ని ట్యూన్స్ కావాలంటే అన్ని ట్యూన్స్ ఇచ్చారట.
మళ్లీ ఇన్నాళ్లకు పెద్ది సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సేమ్ రిపీట్ చేసాడు. ఈ విషయాన్ని ఇటీవలే పెద్ది దర్శకుడు బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు. పెద్ది సినిమాకు రెహమాన్ బాగా కనెక్ట్ అయ్యారు. సినిమాలో ఎమోషన్ కు ఆస్కార్ విన్నర్ ఫిదా అయ్యారు. ఒక్కో పాటకు 20 నుంతి 30 ఆప్షన్స్ ఇస్తున్నారు అని చెప్పుకొచ్చాడు బుచ్చి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడట.
అసలు రెహమాన్ ఏంటి ఇన్ని ఆప్షన్స్ ఇవ్వడం ఏంటని మిగితా ఇండస్ట్రీస్ ఆశ్చర్యపోతున్నాయి. రెహమాన్ డేట్స్ దొరకడం కష్టం. ఒకవేళ రెహమాన్ డేట్స్ ఇచ్చినా, ఇచ్చిన టైమ్ కు ట్యూన్స్ తీసుకోవాలి. ఆయన ఫైనల్ చేసిన ట్యూన్స్ ను దర్శకులు తీసుకుంటుంటారు. అలాంటిది పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు నెలల తరబడి రెహమాన్ తోనే ఉంటున్నాడు. పైగా ఒక్కో పాటకు 20 నుంచి 30 ఆప్షన్స్ అంటే చిన్న విషయం కాదు.
పెద్ది కథ రెహమాన్ కు ఎంతగానో నచ్చకపోతే కాని, ఆయన ఇంత సమయం కేటాయించరు. ఐనా పెద్ది టీజర్ రిలీజైనప్పుడే అర్ధమైంది. పెద్దికి రెహమాన్ మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నట్లు ఆ బీట్స్ వింటేనే తెల్సిపోయింది.
రామ్ చరణ్ కూడా ఇటీవల లండన్ వెళ్లినప్పుడు. పెద్ది గురించి బాగా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. మీరు ఎంతైనా ఊహించుకోండి, పెద్ది అంతకు మించి ఉంటుంది అన్నాడు. సినిమా 30 శాతం పూర్తైందని గుడ్ న్యూస్ షేర్ చేసాడు. పెద్దిలో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలకమైన పాత్ర చేస్తున్నాడు. క్రికెట్ నేపథ్యంలో చిత్రం తెరకెక్కుతోంది. టీజర్ లో రామ్ చరణ్ కొట్టిన షాట్, ఈసారి ఐపీఎల్ సైతం ను షేక్ చేసింది.