ఇటీవల రెండు మూడు రోజుల వార్తలు మీరు ఫాలో అయితే, మీకో ముఖ్యమైన విషయం అర్ధం అవుతుంది. అదే, భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే జీవితంపై బయోపిక్. ఇటు ఎన్టీఆర్, అటు ఆమిర్ ఖాన్ నటిస్తున్నాడు అనే విషయం తెలుస్తుంది. సరిగ్గా ఒక్క రోజు వ్యవధిలో ఫాల్కే బయోపిక్స్ పై తారక్, ఆమిర్ నుంచి ఎనౌన్స్ మెంట్స్ వచ్చాయి. అయితే ఈ స్టోరీలో చిన్న ట్విస్ట్ వచ్చింది. నిజానికి ఫాల్కే జీవితం పై బయోపిక్ తీయాలని రాజమౌళి రెండేళ్ల క్రితమే నిర్ణయించుకున్నా, అందుకు సంబంధించిన రీసెర్చ్ వర్క్ లేదా వారి కుటుంబ సభ్యుల నుంచి పర్మిషన్ అలాంటిది ఏం తీసుకోలేదు.

మరో వైపు ఆమిర్ ఖాన్ తో ఫాల్కే బయోపిక్ తెరకెక్కించాలి అనుకున్న రాజ్ కుమార్ హిరాణి మాత్రం మూడేళ్లుగా ఇదే ప్రయత్నంలో ఉన్నాడు. ఫాల్కే కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నాడు. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులే చెప్పుకొస్తున్నారు. రాజమౌళి ఇంత వరకు ఇంటి వైపుకు కూడా రాలేదని, వారికి ఫాల్కే సినిమా తీసే అర్హత లేదని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. ఈ మాత్రం దానికి, రాజమౌళి ఎందుకు తొందరపడ్డట్లు, పాపం మధ్యలో ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు చెప్పినట్లు..

ఇవి కూడా చదవండి

error: Content is protected !!