
ప్రైడ్ తెలుగు న్యూస్ – ఢిల్లీ ఎలక్షన్స్ -2025 దేశ రాజధాని ఓటింగ్ ముగిసింది. 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ కు గట్టి పోటీ ఇచ్చింది. ఒక దశలో మూడు పార్టీలు, అంటే కాంగ్రెస్, బీజేపీ, ఆప్ మధ్య హోరా హోరిగా పోరు సాగింది. కాని ఎన్నికల రోజుకు మాత్రం ఇటు ఆప్, అటు బీజేపీ మధ్యే తీవ్ర పోటీ నెలకొన్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఢిల్లీ ప్రజలు మాత్రం ఈసారి కాషాయ పార్టీ వైపే మోగ్గు చూపినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ఢిల్లీ రెండున్నర దశాబ్దాలకు పైగా అధికారానికి దూరంగా ఉన్న బీజేపి అధికారం చేపట్టడం ఖాయం.
జేవీసీ పోల్ బీజేపీ 39 నుంచి 45 సీట్లు వస్తాయని అంచానా వేస్తే, ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం 32 నుంచి 33 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పింది. ఇక కాంగ్రెస్ ఈసారి ఢిల్లీలో ఖాతా తెరవడంపై అనుమానాలు ఉన్నట్లు తెలిపింది. టైమ్స్ నౌ బీజేపీకి 39 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మ్యాట్రిక్స్ సంస్థ మాత్రం ఆప్ కు 32 నుంచి 37 సీట్లు రావచ్చు అంటూ అంచనా వేసింది. బీజేపీకి కూడా 35 నుంచి 40 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. చాణక్య స్ట్రాటజీ సర్వే ఢిల్లీ పీఠం బీజేపీదే అని చెప్పింది. పీపుల్స్ పల్స్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా భాజపాకు 60 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
ఢిల్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా, మెజార్టీ మార్క్ 36 సీట్లు. 2015 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67 సీట్లు గెల్చుకుని చరిత్ర సృష్టించింది.అప్పుడు బీజేపీ కేవలం మూడు స్థానాలకు పరిమితం అయింది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కి 62 సీట్లు వచ్చాయి. బీజేపీ మాత్రం 8 సీట్లతో సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అనూహ్యంగా పుంజుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఒకటి రెండు తప్పితే మిగితా అన్ని సర్వేలు భాజపా వైపే మొగ్గు చూపుతున్నాయి