నవాజ్ షరీష్ ఈ పేరును భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేరు. 1999లో కార్గిల్ యుద్ధానికి తాను ఒక కారకుడు. అప్పుడు ఆయన దాయాది దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ముస్లీం లీగ్ – నవాజ్ పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ప్రధానిగా మాత్రమే ఉన్నారు. చాలా వరకు లండన్ లోనే ఉంటున్నారు. ఇటీవల పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ ప్రధాని సెహబాజ్ , మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తో భేటీ అయ్యాడు.

భారత్ తీసుకుంటున్న నిర్ణయాలకు పాకిస్తాన్ ఏం చేయబోతుందో వివరించే ప్రయత్నం చేసాడు. మోదీ తీరు వల్లే భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని సెహబాజ్  చెప్పే ప్రయత్నం చేస్తుండగా, నవాజ్ మాత్రం పాకిస్థాన్ దూకుడు తగ్గించాలని, ఈ దూకుడు భారత్ దూకుడు ముందు అస్సలు సరిపోదని, భారత్ తో అర్జెంటుగా  శాంతి చర్చలు తిరిగి ప్రారంభించాలని, అందుకోసం అందుబాటులో ఉన్న దౌత్య మార్గాలన్నిటిని వినియోగించుకోవాలని చెప్పుకొచ్చారు. కాని సెహబాజ్ చేతుల్లో ఏ నిర్ణయం ఉండదని, పాకిస్థాన్ ఆర్మీ చెప్పినట్లే ఆ దేశ ప్రధాని నడుచుకుంటారని, హిస్టరీ చెబుతూనే ఉంది.

మరో వైపు ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధాని సెహబాజ్ ఎవరో కాదు, షరీష్ కు స్వయాన సోదరుడు. ప్రస్తుతం భారత్ తో సంప్రదింపులు జరిపేందుకు నవాజ్ షరీఫ్ స్వయంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

error: Content is protected !!