ఐదేళ్ల క్రితం కరోనా సృష్టించిన అల్ల కల్లోలం అంతా ఇంతా కాదు. కోవిడ్ కాలం గుర్తుకు వస్తేనే వణికిపోతారు జనం. అలాంటి రోజులు ముగిసిపోయాని, అందరూ ఊపిరి పీల్చుకుని, మళ్లీ సాధారణ జీవితాలకు అలవాటు పడ్డాం. అంటే ముఖానికి మాస్క్ లు, చేతులకు సానిటైజ్లు వాడటం మానేసి, కరోనా రాకముందు రోజుల్లోకి వెళ్లిపోయారు. కోవిడ్ కాలాన్ని పీడకలగా మర్చిపోయాం.

అయితే ఇప్పుడు కోవిడ్ మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. కొన్ని దేశాల్లో ప్రభావం చూపించడం  ప్రారంభించింది. ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయ్ ల్యాండ్ తో పాటు, కరోనా పుట్టిన దేశం చైనాలోనూ కోవిడ్ 19 వ్యాప్తి విపరీతంగా ఉంది. వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే తీవ్రత తక్కువగా ఉండటం ఉపశమనాన్ని కలిగిస్తోంది.

సింగపూర్ లో ఏప్రిల్ చివరి వారానికి 14 వేల కరోనా కేసులు వచ్చాయి, నిత్యం బాధితులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఐసీయూలో చేరికలు మాత్రం పెద్దలేవు. థాయ్ ల్యాండ్ లో మే రెండోవారానికి 33 వేల కేసులు రిజస్టర్ అయ్యాయి. చైనా, హాంకాంగ్ లో కూడా ఇంచు మించు ఇదే పరిస్థితి ఉంది. ఆసియా దేశాల్లో మళ్లీ కోవిడ్ 19 వ్యాప్తికి కారణం జేఎన్ 1 వేరియంట్, దాని ఉపరకాలే కారణం అని అధికారులు చెబుతున్నారు. జేఎన్ 1, ఉపరకాలైన ఎల్ ఎఫ్ 7, ఎన్  బీ 1.8 వేరియెంట్ల వ్యాప్తి అధికంగా ఉందని సింగపూర్ ఆరోగ్యశాఖ తెలిపింది.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ 19 వ్యాక్సిన్ లో జేఎన్ 1 వేరియెంట్ ను ఉపయోగించినట్లు వెల్లడించింది.వైరస్ పెరుగుదలకు ప్రజల్లో రోగనిరోధక శక్తి క్షీణించడం ఇందుకు కారణం అంటోంది హాంకాంగ్ ఆరోగ్య శాఖ.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!