పాన్ ఇండియా కాలం ఏంటి , తెలుగు సినిమాలకు తారక్ దూరం కావడం ఏంటి అంటారా, ఇది ప్రైడ్ తెలుగు డౌట్ కాదు. ఎన్టీఆర్ అభిమానుల అనుమానం. తెలుగు సినిమా ఇండస్ట్రీ అనుమానం. అదెలా అంటారా.. వన్స్ త్రిబుల్ ఆర్ గ్లోబల్ రేంజ్ లో దుమ్మురేపింది. ఎన్టీఆర్ ను విశ్వనటుల జాబితాలో చేర్చింది. ఎన్టీఆర్ కు ఇప్పుడు టాలీవుడ్ దాటి, బాలీవుడ్, హాలీవుడ్, జపాన్ లో కూడా అభిమానులు ఏర్పడ్డారు. ఈ దశలో ఎన్టీఆర్ ఇంకా తెలుగు నేటివిటీ స్టోరీ ఎలా చేస్తాడు అనేది ఇప్పుడు ఆయన అభిమానులకు, ఇండస్ట్రీ పెద్దలకు కలుగుతున్న అనుమానం. త్రిబుల్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ , ఎన్టీఆర్ ను టాలీవుడ్ కు దూరం చేసే ప్రమాదం ఎక్కువగా ఉంది.

ఎందుకంటే టైగర్ కోసం ఆల్రెడీ బాలీవుడ్ బడా నిర్మాతలు డేట్స్ కోసం ఖర్చీఫ్ వేసి ఉంచారు. ఇప్పటికే యశ్ రాజ్ సంస్థతో ఎన్టీఆర్ డీల్ కుదుర్చుకున్నాడు.అదేంటి అంటే  వార్ -2లో తాను విలన్ గా కనిపిస్తాడు. ఆ తర్వాత తనతో యశ్ రాజ్ ఫిల్మ్స్ సోలో ఫిల్మ్ ప్లాన్ చేయాలి. అలాగే యశ్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కించే స్పై యూనివర్స్ లో వీలనన్ని సార్లు ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉండేలా ప్లానింగ్ చేస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ మేకింగ్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాల సంగతి తెలిసిందే.ప్రశాంత్ నీల్ హిస్టరీ లో సింగిల్ పార్ట్ లో స్టోరీ చెప్పింది లేదు. సో డ్రాగన్ కు సీక్వెల్స్ ఉండే అవకాశం లేకపోలేదు. వీటితో పాటు ఇప్పుడు రాజమౌళి పర్యవేక్షణలో  దాదాసాహెబ్ ఫాల్కే జీవితం పై తెరకెక్కే బయోపిక్, అలాగే త్రిబుల్ ఆర్ సీక్వెల్, దేవరకు  సీక్వెల్ లైన్ లో ఉన్నాయి.

మరి ఎన్టీఆర్ మార్క్ చూపించే తెలుగు చిత్రాల పరిస్థితి ఏంటి.. ముఖ్యంగా అరవింద సమేత వీర రాఘవ, జనతా గ్యారేజ్, బృందావనం లాంటి చిత్రాలు ఇక నుంచి ఎన్టీఆర్ నుంచి ఆశించలేని పరిస్థితి కనిపిస్తోంది. అందుకే తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఎన్టీఆర్ కు సలహాలు ఇస్తున్నారట. ఏ ఇండస్ట్రీ వెళ్లినా, పాన్ ఇండియా చిత్రాలు చేసినా, మరో వైపు తెలుగు చిత్రాలు మాత్రం చేస్తుండాలి అని చెబుతున్నారట.

ఇవి కూడా చదవండి
error: Content is protected !!