భారత్ , పాక్ మధ్య ఉద్రక్తతలు నేపథ్యంలో, భారత్ ఎవరూ ఊహించని ఎత్తుగడ వేసింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జై శంకర్ , ఆఫ్గానిస్థాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న ఆమిర్ ఖాన్ ముత్తాఖీతో ఫోన్ లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించడం జైశంకర్ స్వాగతించారు. ఇది తెలియాలి అంటే గత ఏడాది డిసెంబర్ లో ఏం జరిగిందో  తెల్సుకోవాలి.

ఇటీవల కాలంలో అఫ్గానిస్థాన్ కేంద్రంగా పని చేస్తోన్న  తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ అనే సంస్థ తరచూ పాకిస్థాన్ దాడులకు పార్పడుతోంది. ఈ సంస్థకు తాలిబన్లు మద్దతు పలుకుతోందని పాక్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గత ఏడాది డిసెంబర్ లో తెహ్రీక్ పాకిస్థాన్ లో దాడులు చేసింది. దాంతో అఫ్గానిస్థాన్ లోని పలు ప్రాంతాలపై పాకిస్థాన్ వైమానిక దాడులకు దిగింది.

ఉగ్ర శిబిరాలపై మాత్రమే దాడులు చేశామని పాక్  చెప్పినా, భారీ సంఖ్యలో ప్రజలు మృతి చెందినట్లు తాలిబన్లు చెప్పుకొచ్చారు. రెండు దేశాల సరిహద్దు రేఖ విషయంలోనూ గొడవలు జరుగుతున్నాయి. ఈ దశలోనే రెండు దేశాల మధ్య శత్రుత్వం పెరిగి పెద్దదైంది. ఈ క్రమంలోనే అఫ్గన్లు భారత్ కు దగ్గర కావడం ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!