2017లో బాలీవుడ్ లో రిలీజైన టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ చిత్రం గురించి వినే ఉంటారు. ఇంకో రెండేళ్లు అయితే ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఇప్పుడు ఈ సినిమా వార్తల్లోకి ఎక్కింది. అందుకు కారణం అమితాబ్ బచ్చన్ భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి జయాబచ్చన్. ఆమెకు ఈ సినిమా కాదు.. అసలు టైటిల్ నచ్చలేదట. అందుకే ఇంతవరకు సినిమా చూడలేదట.

మీరే చెప్పండి ఇలాంటి టైటిల్ తో ఉన్న సినిమాకు వెళ్తారా.. వెళ్లరు కదా.. అంటూ ఓ ఈవెంట్ లో టాయిలెట్ మూవీపై ఆగ్రహం వ్యక్తం చేసారు జయా బచ్చన్. కాని 2017లో బాలీవుడ్ నుంచి రిలీజైన అత్యుత్తమ చిత్రాల్లో టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ ఒకటి. పేరులో టాయిలెట్ ఉన్నా, సినిమా కథ మొత్తం టాయిలెట్ చుట్టూ తిరిగినా, ఈ మూవీని ఉత్తరాది ప్రేక్షకులు ఆదరించారు. సూపర్ హిట్ చేసి పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల కొరతను ఎత్తి చూపుతూ తెరకెక్కిన ఈ సినిమా,అందుకు సంబంధించిన అవగాహన తీసుకొచ్చింది. అందులోనూ అక్షయ్ కుమార్ తనదైన నటనతో సమస్యను ప్రేక్షకులకు అర్దమయ్యేలా చేసాడు.

టాయిలెట్ పై ప్రధాని మోదీ సైతం ప్రశంసలు కురిపించారు. స్వచ్ఛ భారత్ అభయాన్ పధకం ప్రచారానికి, ఈ సినిమా ఎంతో దోహదం చేస్తుంది అన్నారు. బిల్ గేట్స్ సైతం 2017లో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా కీర్తించాడు. ఇలాంటి సినిమాపై, కేవలం టైటిల్ బాగోలేదు అనే కారణంతో జయా బచ్చన్ విమర్శలు చేయడం అందర్ని విస్మయపరుస్తోంది. పైగా ఎంపీగా ఉండి ఇలాంటి విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అంటున్నారు.

టాయిలెట్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం చాలా గొప్ప చిత్రం. హిందీ సినీ పరిశ్రమ తీసుకొచ్చిన గొప్ప చిత్రాల్లో ఒకటి, అలాంటి సినిమా జయా  బచ్చన్ కు నచ్చనంత మాత్రనా, తక్కువై పోదు. జయా ఫ్లాప్ మూవీ అనడంతో ఫ్లాప్ అయిపోదు. రాజకీయ పార్టీలు కొన్ని సినిమాలు తీస్తున్నాయి, అందులో భాగంగా తీసిన సినిమాగా జయా ఈ చిత్రాన్ని తీసి పారేసారు. కాని ప్రజలను జాగృతం చేసిన అద్భుత మూవీ అని ఆమె గ్రహించలేకపోయారు.

error: Content is protected !!