
గూఢచర్యం ఆరోపరణలపై అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా లైఫ్ స్టైల్ ను గమనిస్తే సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్ ఎంబసీకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ అయింది.
కొద్ది రోజులుగా ఆమె వ్యక్తిగత జీవితం చాలా విలాసవంతంగా మారిపోయింది. నిజానికి జ్యోతి మల్హోత్రా మధ్య తరగతి కుటుంబానికి చెందిన మహిళ. అయితే కొంత కాలంగా ఆమె ఖరీదైన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. విమానం ఎక్కితే మొదటి తరగతి, ఖరీదైన హోటళ్లలో బస, అంతకు మించి ఖరీదైన రెస్టారెంట్స్ లో డైనింగ్, ఇక జ్యోతి పాక్ పర్యటనకు వెళితే మాత్రం మొత్తం ఖర్చంతా కూడా అక్కడి స్పాన్సర్లు చూసుకుంటున్నారట. పాక్ పర్యటనలో కూడా లగ్జరీ కార్లలో ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు.
ఈ ఏడాది జనవరిలో పహల్గాం వెళ్లింది జ్యోతి మల్హోత్రా. అనంతరం మూడు నెలలకు అక్కడ ఉగ్రదాడి జరిగింది. ఐదు రోజుల కశ్మీర్ పర్యటనలో భాగంగా జ్యోతి పెహల్గాం వెళ్లింది. అక్కడి వీడియోలు తీసి, వాటిని పాక్ ఏజెంట్లకు చేరవేసిందా, జ్యోతి పర్యటనకు ఉగ్రదాడికి లింక్ ఉందా అనేది విషయాలను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు.
పహల్గాం ఉగ్రదాడి జరిగిన రెండు రోజులకు ఢిల్లీలోని పాక్ ఎంబసీకి గడ్డంతో ఉన్న వ్యక్తి కేక్ తీసుకొచ్చిన వీడియో తెగ వైరల్ అయింది. ఇప్పుడు ఆ వ్యక్తితో జ్యోతి మల్హోత్రా దిగిన ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి