గీత గోవిందం ఏంటి, సుందరం ఏంటి, అంటూ కన్ ఫ్యూజ్ కాకండి. ఎందుకంటే టైటిల్లోనే స్టోరీ చెప్పేశాం. అదేంటి అంటే గీత గోవిందం దర్శకుడు పరశురామ్ ఉన్నాడుగా ఆయన ఫ్యామిలీ స్టార్ తీసి డిజాస్టర్ చూసాడు. దాంతో కొంత టైమ్ తీసుకుని రాంచ్ రాజు, లేదా రంచ్ రాజు అనే పేరుతో కథ రాసుకున్నాడు. ఇదో ఊర మాస్ మూవీ. ఈ చిత్రంలో హీరోగా తమిళ స్టార్ కార్తి డేట్స్ అడుగుతున్నాడట పరశురామ్. కార్తికి స్టోరీ చెబితే బాగుందని చెప్పాడట. దాంతో వీరి కాంబినేషన్ లో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి నిర్మాత దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు.

కార్తి ఇప్పుడు సర్దార్ సీక్వెల్, మరో తమిళ సినిమా వా వాతియార్ చిత్రాలను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఇక మోస్ట్ అవైటెడ్ ఖైదీ సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ కానుంది. పరశురామ్ ఖైదీ సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అయ్యే లోపే కార్తితో సినిమా చేయాలి. లేదా కార్తి ఇప్పుడప్పుడే దొరికే అవకాశం లేదు. అన్నట్లు మరో విషయం, కార్తి ఆల్రెడీ తెలుగులో హిట్-4 లో నటిస్తున్నాడు. సో ఊపిరి తర్వాత కార్తి టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు అనమాట.

error: Content is protected !!