ఎవరికి చెప్పుకోలేక.. ఏం చేయాలో అర్ధం కాక.. పురుషులు కుప్పుకూలిపోతున్నారు..

తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. పరిస్థితులు ఎదుర్కొనేందుకు న్యాయపరమైన వెసులుబాట్లు లేకపోవడంతో, బాధితులు , అంటే కొంతమంది పురుషులు కుమిలిపోతున్నారు అని ఒక అధ్యయనంలో తెలింది. ఫలితంగా పురుషుల్లో డిప్రెషన్ పెరిగి ఆత్మహత్యలు పెరుగుతున్నాయని సర్వే తెల్చింది.2022లో భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 72 శాతం పురుషులే అని ఎన్ సీ ఆర్ బీ నివేదిక చెప్పుకొచ్చింది.

గృహ హింస కేసులు, లైంగిక వేధింపుల కేసులు, న్యాయపరమైన వేధింపుల కేసులు, భావోద్వేగాలను రెచ్చగొట్టడం, అసత్య ఆరోపణలు.. ఇలాంటి అంశాలను పురుషుల్లో ఇంత మానసిక సంఘర్షకు కారణం అవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యవహారాల్లో ఉపశమనం కోసం పురుషులకు తగిన న్యాయపరమైన వెసులు బాట్లు లేవని, దీనిపై వెంటనే దృష్టి సారించాల్సి ఉందని వైద్యలు నొక్కి చెబుతున్నారు.

పురుషులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలను చూసి చూడనట్లు వదిలి వేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని, న్యాయపరమైన సంస్కరణలు అవసరమని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ జనరల్ సెక్రటకీ శ్వేతా శర్మ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి     
 

error: Content is protected !!