
దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన జూనియర్ డాక్టర్ అభయ దారుణ హత్య కేసులో దోషి సంజయ్ రాయ్ కు శిక్ష ఖరారైంది. కోల్ కతా లోని సియాల్దా కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది.గత ఏడాది ఆగస్ట్ 9వ తేదీ రాత్రి ఆర్జీకర్ ఆసుపత్రి సెమినార్ రూమ్ లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై సంజయ్ రాయ్ అత్యా చారం చేసి, అనంతరం గొంతు పిసికి హత్య చేసినట్లు ఋజువైందని జడ్జి తెలిపారు.సంజయ్ సమీప పోలీస్ స్టేషన్ లో సివిక్ వాలంటీర్ గా పని చేసే వాడు.బందోబస్తు నిమిత్తం ఆ ఆస్పత్రిలో పని చేసేవాడు..ఆస్పత్రిలో ఆన్ డ్యూటీ డాక్టర్ గా విధులు నిర్వర్తించి రాత్రి సెమినార్ హాల్ లో నిద్రిస్తున్న 31 ఏళ్ల మెడికోపై వేకువ జాము నాలుగు గంటల సమయంలో, ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన తీవ్ర నిరసనలకు దారితీసింది.

పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల తో ఈ కేసును కోల్ కతా పోలీసులు నుంచి సీబీఐ స్వీకరించి విచారణ చేపట్టింది. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ ను ఆగస్ట్ 10న కోల్ కతా పోలీసులు అరెస్ట్ చేసారు. ఇక ఈ కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ ఛార్జి అభిజిత్ మండల్ ను అరెస్ట్ చేసారు. సాక్ష్యాలు తారుమారు చేశారన్ని ఆరోపణలపై వారు అరెస్ట్ కాగా.. తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. వారు అరెస్ట్ అయిన దగ్గరి నుంచి 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్ షీట్ ను ఫైల్ చేయకపోవడంతో బెయిల్ లభించింది. కోల్ కతా పోలీసు విభాగంలో పౌర వాలంటీర్ అయిన రాయ్ ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సీబీఐ పేర్కొంది. నవంబర్ 12న మొదలైన రహస్య విచారణ జనవరి 9న ముగిసింది. 50 మంది సాక్షులను విచారించారు. కోర్టు తీర్పును సవాలు చేయబోమని సంజయ్ రాయ్ సోదరి తెలిపారు.