
రికార్డులకు కేరాఫ్ అడ్రస్ ఐపీఎల్. అలాంటి ఐపీఎల్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ అంటే, అది ఎంత పెద్ద రికార్డ్ అనేది ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది. ఢిల్లీపై గుజరాత్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. వికెట్ కోల్పోకుండా 200 పరుగులు ఛేజ్ చేసిన మొదటి జట్టుగా, గుజరాత్ రికార్డుల్లోకి ఎక్కింది. ఓపెన్లు సాయి సుదర్శన్, కాప్టెన్ శుభ్ మన్ గిల్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. దాంతో గుజరాత్ టీమ్ కనీవినీ ఎరుగని రికార్డ్ సెట్ చేసింది.
అంతకు ముందు ఈ రికార్డ్ కోలకతా పేరున ఉండేది. 2017 ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ లయన్స్ పై వికెట్ నష్టపోకుండా కోల్ కతా 184 పరుగులు ఛేదించింది. అంతే కాదు ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ పరుగులు చేసిన జంట కూడా గిల్, సుదర్శన్ పేరిట నమోదు అయింది. ఇప్పటి వరకు వీరిద్దరు, అంటే ఈ సీజన్ లో 839 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేసారు. ఆ తర్వాత ప్లేస్ శిఖర్ ధావన్, షా లు 744 పేరుతో ఉంది. ఇక ఈ సీజన్ లో 9 విజయాలతో అగ్ర స్థానంలో ఉన్న గుజరాత్ ఇప్పటికే ప్లేఆఫ్ లో బెర్త్ ఖరారు చేసుకుంది. మరోసారి టైటిల్ అందుకునేందుకు అడుగులు వేస్తోంది.
ఇవి కూడా చదవండి