
రకరకాల దొంగలను చూసి ఉంటాం. డబ్బు, బంగారం దోచుకునే దొంగలే ఎక్కువ. అప్పుడే వాడు దొంగ అనిపిలిపించుకుంటాడు. లేదా ఖరీదైన వస్తువులు, వాహనాలు దొంగలించి, దొంగ అని పిలిపించుకునేవారిని చూసాం. కాని చేతిలో ఉన్న ఫోన్స్ కొట్టేసి, పారిపోయే దొంగలు చాలా అరుదు కదా. ఇదేదో సెల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లుగా మారిన రోజుల్లో దొంగల స్టోరీలా ఉంది అనుకుంటే మీరు పొరబడినట్లే, ఎందుకంటే లండన్ లాంటి ధనిక దేశంలో సెల్ ఫోన్ దొంగలు రెచ్చిపోవడం, ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అక్కడి పోలీసులకు సవాలు గా మారింది.
ఏదో నాలుగు సెల్ ఫోన్లు దొంగలించినంత మాత్రానా, అది లండన్ లో కాబట్టి, ఇక్కడ ఇంత హడావుడి చేస్తున్నారు అనుకోవద్దు. నాలుగు కాదు కదా వంద సెల్ ఫోన్లు కొట్టేసిన స్టోరీ అయ్యేది కాదు. లాస్ట్ ఇయర్ లండన్ లో మొబైన్ ఫోన్ చోరీ కేసులు ఎన్నో తెలుసా, 83 వేల ఫోన్లు కొట్టేసారట. అంటే నిత్యం 225 ఫోన్లు చోరీకి గురవుతున్నట్లు లెక్క. లండన్ లోని వెస్ట్ ఎండ్, వెస్ట్ మినిస్టర్ ప్రాంతాల్లోనే ఈ చోరీ ఎక్కువగా ఉన్నాయట. దాంతో లండన్ వీధుల్లో నడవాలి అంటేనే అక్కడి పౌరులు భయపడే పరిస్థితులు వచ్చేసాయి. రోజు రోజుకు చోరీ కేసులు పెరుగుతుండటంతో, బైక్ వచ్చి ఇట్టే ఫోన్స్ చోరీ చేస్తుండటంతో,
పోలీసులు సివిల్ డ్రెస్ లో ఉంటూ నిఘా పెంచారు. ఇటీవల పోలీసులకు పట్టుబడిన నిందితుడి బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే, ఆ ఒక్క రోజులోనే 12 సెల్ ఫోన్లు చోరీ చేసాడని తెలిసి ఖాకీలే ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఈ సెల్ ఫోన్స్ ను ఏం చేస్తున్నారు అంటే, అదో పెద్ద వ్యాపారం అట. చోరీ చేసిన సెల్ ఫోన్లతో ఏట 450 కోట్ల వ్యాపారం చేస్తున్నారట. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నారు. గత వారం రోజుల్లో 250 మంది అరెస్ట్ చేసారు. వారి దగ్గరి నుంచి దాదాపు వెయ్యి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మరో వైపు మొబైల్ ఫోన్స్ లో సెక్యూరిటీ ఫీచర్లను పెంచాలని ప్రముఖ కంపెనీలకు అక్కడి హోం మంత్రి విజ్ఞప్తి చేసారు. లండన్ లాంటి దేశంలో , ఈ సెల్ ఫోన్ దొంగతనాలు ఏంటని, అందరు చర్చించుకుంటున్నారు. అక్కడ అంతర్జాతీయ సందర్శకులు, వ్యాపారవేత్తలు, షాపింగ్స్ తో బిజీ ఉండే వారందరూ ఇప్పుడు సెల్ ఫోన్ దొంగలకు టార్గెట్ గా మారారు.