
సరిహద్దులో పాక్ తో ఉద్రిక్తతలు నెలకొనడంతో భారత్, అఫ్గాన్లకు స్నేహ హస్తాన్ని చాచింది. వారితో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే పాయింట్ లో భారత్ వెళ్తోంది. సో దట్ అఫ్గాన్లతో చెలిమికి సిద్ధమవుతోంది. అసలు అఫ్గానిస్థాన్ లోని కాందహార్ ను అప్పట్లో గాంధార రాజ్యంగా పిలిచేవారట. ఆ ప్రాంతానికి చెందిన వాడే శకుని అంటారట. 1100 సంవత్సరం వరకు అఫ్గానిస్థాన్ అఖండ భారతంలో భాగంగా ఉండేది.
ఆ తర్వాత 18వ శతాబ్ధంలో బ్రిటన్, రష్యాల విస్తరణ కాంక్షతో ఈ ప్రాంతం విచ్ఛిన్నమైంది. 1983లో అప్పటి బ్రిటీష్ పాలకులు భారత్, అఫ్గాన్ మధ్య సరిహద్దు గీత గీశారు. అయితే అఫ్గన్లు ఆ గీతను గుర్తించలేదని చరిత్ర చెబుతోంది. 1919లో ఆంగ్లో, అఫ్గాన్ యుద్ధం తర్వాత, స్వాతంత్ర్యం వచ్చింది. 1973వో గణతంత్ర దేశంగా అఫ్గానిస్థాన్ అవతరించింది. ఆ తర్వాత చాలా ఏళ్లు భారత్ కు అనుకూల దేశంగా ఉండేది అఫ్గాన్. కాని 1996లో ఆ దేశంలో జరిగిన సివిల్ వార్ లో పాకిస్థాన్ సాయంతో తాలిబన్లు విజయం సాధించారు. తీవ్రవాద ఎజెండాను అమలు చేయడం ప్రారంభించారు. దీంతో భారత్ అఫ్గాన్ ను దూరం పెట్టడం ప్రారంభించింది.
1999 కాందహార్ హైజాక్ ఉదతంతో భారత్, అఫ్గాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మళ్లీ ఈ ఏడాది ప్రారంభంలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, ఆ దేశ తాత్కాలిక విదేశాంగ శాఖ మంత్రితో భేటి అయ్యారు. 1996 తర్వాత అఫ్గనిస్థాన్ తో అధికారిక చర్చలు జరగడం ఇదే మొదటి సారి.. ఇప్పుడు మళ్లీ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అఫ్గాన్ మంత్రి ఆమిర్ ఖాన్ తో మాటలు కలపడంతో ఇరు దేశాల మధ్య మళ్లీ స్నేహం చిగురించినట్లు అయింది.