కొన్ని సార్లు పవన్ స్పందించే తీరు అద్భుతంగా ఉంటుంది. అలాంటి సంఘటనే మరోసారి రిపీటైంది. హరి హర వీరమల్లు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ జరుగుతోంది. ఈ సమయంలో పవన్ స్వయంగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి స్టూడియోకు వెళ్లారు. బాహుబలి కి మ్యూజిక్ ఇక్కడే చేసారా? అని అడిగారు. అంతేనా వీరమల్లు కోసం కీరవాణి స్వరపరిచిన సలసల పాటను అనే 50 సార్లకు పైగా విన్నానని, అసలు ఒక పాటను అలా ఎలా కంపోజ్ చేసారంటూ, కీరవాణి పై ప్రశంసల వర్షం కురిపించారు పవన్. ఈ పాట వింటే పౌరుషం ఉబికి వస్తుందన్నారు… అంతేనా అంటే, ఇక కీరవాణి స్టూడియో వరకు వెళ్లారు కాబట్టి, ఆయన త్రిబుల్ ఆర్ కోసం అందుకున్న ఆస్కార్ అడిగికి మరీ , తెప్పించుకుని మరీ చూసారు పవన్. ఆ తర్వాత కీరవాణిని సత్కరించారు పవన్. ఈ సందర్భంగా కీరవాణి ఒక పుస్తకాన్ని పవన్ కు బహూకరించారు. జూన్ 12న వీర మల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి

error: Content is protected !!