
మూడేళ్ల క్రితం, కేజీయఫ్ 2 రిలీజైంది. బాక్సాఫీస్ రికార్డులన్నిటిని చెల్లా చెదురు చేసింది. యశ్ ను ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ను చేసింది. అలాంటి హీరో కొత్త సినిమా కోసం ఎంత ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. అందుకే రెండేళ్లుగా రాఖీభాయ్ రీఎంట్రీ కోసం, అభిమానులు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాని యశ్ మాత్రం ఏళ్లకు ఏళ్లకు కొత్త సినిమా షూటింగ్స్ తోనే గడిపేస్తున్నాడు. ఆ మూవీ పేరు టాక్సిక్. చాలా పెద్ద చిత్రం. కన్నడ ప్రొడక్షన్ హౌజ్, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. హీరోయిన్ గా కియారా, యశ్ కు అక్కగా నయనతార నటిస్తున్నారు.
ఇతర పాత్రల్లో హ్యూమా , తారా కనిపించబోతున్నారు. మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్లో మూవీని రిలీజ్ చేస్తాను అన్నాడు యశ్. కాని ఇప్పుడు మాట తప్పాడు. ఎందుకలా అంటే, షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు అంటున్నాడు. అందుకే వచ్చే ఏడాది సరిగ్గా ఇదే సమయానికి బాక్సాఫీస్ ముందుకు వస్తాను అంటున్నాడు. అనడం మాత్రమే కాదు, వచ్చే ఏడాది మార్చి 19న టాక్సిక్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. వచ్చే ఏడాది ఇదే సమయానికి మళ్లీ ఉగాది, ఈద్ పండగలు కలసి రానున్నాయి. వరుస సెలవలు ఉన్నాయి. అందుకే, నెక్ట్స్ ఇయర్ కలుద్దాం అంటూ అఫీసియల్ పోస్టర్ రిలీజ్ చేసాడు. పోస్టర్ మాత్రం అదిరిపోయింది.
