
సోషల్ మీడియా అనగానే అదో ఫ్రీ ప్లాట్ ఫామ్. ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదు. కావాల్సిన డీటైల్స్ ఎంట్రీ చేస్తే చాలు, ఇట్టే ఎకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ముఖ్యంగా చిన్నారులు కూడా ఇట్టే ఎకౌంట్స్ క్రియేట్ చేసేస్తూ, గంటల తరబడి సోషల్ మీడియాలో గడిపేస్తున్నారు. కాని ఇకపై మాత్రం అలా కుదరదు అంటోంది కేంద్ర ప్రభుత్వం ఇక మీదట పిల్లలు సోషల్ మీడియా లో ఎకౌంట్ ఓపెన్ చేయాలంటే ,పేరెంట్స్ పర్మిషన్ మస్ట్ . ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకు వస్తోంది.
ప్రజల డిజిటల్ డేటా దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కేంద్రం 2023లో డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ చట్టాన్ని చేసింది. ఈ చట్టం అమలుకు అవసరమైన ముసాయిదా నిబంధలను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ ఇటీవలే జారీ చేసింది. ఫిబ్రవరి 18 లోపు ముసాయిదా నిబంధనలపై మైగవ్.ఇన్ అనే పోర్టల్ ద్వారా అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరింది. వీటి ప్రకారం పిల్లల డాటాను ప్రాసెస్ చేసే ముందు కంపెనీలు తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వం జారీ చేసిన ఐడీ కార్డులు, లేదా డిజిటల్ కార్డులు ద్వారా పిల్లల తల్లిదండ్రులను ధృవీకరించాల్సి ఉంటుంది. డిటిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ చట్టం అమలుకు, కేంద్ర ప్రభుత్వం డాటా ప్రొటెక్షన్ బోర్డ్ ను ఏర్పాటు చేయబోతోంది. ఎవరైనా చట్ట ఉల్లంఘనకు పాల్పడితే విచారణ జరిపి, జరిమానాలు విధించే అధికారాలు ఈ బోర్డుకు కలిగి ఉంటుంది. గరిష్టంగా రూ.250 కోట్లు జరిమానా విధించవచ్చు.