
పుష్ప అంటే అల్లు అర్జున్, సుకుమార్, అలాగే ఆర్య అంటే కూడా వీరిద్దరే.. ఇంకా చెప్పాలంటే పుష్ప కంటే ఆర్యకు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. అసలు బన్నికి టాలీవుడ్ లో స్టార్ డమ్ తీసుకొచ్చిందే ఈ చిత్రం, పైగా మాలీవుడ్ వాళ్లకు అల్లు అర్జున్ ను దగ్గర చేసింది ఈ చిత్రం, అలాంటి చిత్రానికి ఇప్పుడు మూడోభాగం, కాని బన్ని లేడట, సుకుమార్ ఉండడు అట. ఆర్య వచ్చింది బ్లాక్ బస్టర్ అయింది. ఆంధ్ర దేశాన్ని ఊపేసింది. యూత్ అంతా బన్ని పేరును కలవరించింది. ఆ తర్వాత ఆర్య -2 వచ్చింది.
టాలీవుడ్ కు సీక్వెల్స్ అచ్చివారు అనే రోజుల్లో, సుకుమార్ ధైర్యం తీసిన సినిమా ఇది. అయినా సరే సూపర్ హిట్టైంది. ఈ చిత్రంలో బన్ని క్యారెక్టర్ ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది. అలాంటి సినిమాకు ఇప్పుడు మూడో భాగం తీసుకురాబోతున్నారు. ఎందుకంటే ఇటీవలే నిర్మాత దిల్ రాజు ఆర్య 3 టైటిల్ రిజిస్టర్ చేసాడు. నిజానికి రెండు మూడు ఏళ్ల క్రితమే, ఆర్య -3 వస్తుందని ప్రకటించాడు సుకుమార్.
అయితే తానే దర్శకుడిగా మారుతాడా, అల్లు అర్జున్ డేట్స్ పడతాడా అనేది చెప్పలేదు. ఎందుకంటే అప్పుడు బన్ని, సుకుమార్ ఇద్దరూ కూడా పుష్ప సిరీస్ మూవీస్ తో బిజీగా ఉన్నారు. ఇప్పుడు దిల్ రాజు సడన్ గా ఆర్య -3 టైటిల్ ను రిజిస్టర్ చేయడంతో, సుకుమార్, బన్ని ఈ చిత్రం కోసం చేతులు కలుపుతారా అదీ లేదు. ఎందుకంటే అటు అల్లు అర్జున్, ఇటు సుకుమార్ ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు.
ఈ దశలో దిల్ రాజు ఎందుకు ఆర్య-3 టైటిల్ ను రిజిస్టర్ చేసాడు అంటే, తన మేనల్లుడు ఆశిష్ రెడ్డి కోసం అట. అదే నిజమైతే మాత్రం, బన్ని ఫ్యాన్స్ ఊరుకోరు. సీక్వెల్ క్రేజ్ కూడా తగ్గిపోతుంది. కాస్త ఆలోచించండి దిల్ రాజు గారు..