
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో, నయనతార తిరుగులేని నటి. ఆ విషయం ఆమెకు కూడా తెల్సు. అందుకే తాను తెరపై కనిపిస్తే చాలు, కోట్లకు కోట్లు కురుస్తాయని, వందల కోట్ల వ్యాపారం జరుగుతుందనే నమ్మి, కెరీర్ బిగినింగ్ నుంచి అంటే తనకు స్టార్ డమ్ వచ్చినప్పటి నుంచి, ప్రమోషన్స్ కు దూరంగా ఉంటుంది. ఎంతమంది దర్శకనిర్మాతలు, ఎన్ని ఇండస్ట్రీలో అరిచి గీ పెట్టిన నయన్ మాత్రం కనుకరించలేదు. ప్రమోషన్స్ వేపు చూసిన పాపాన పోలేదు. అలాంటి హీరోయిన్ ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కు కాదు, సినిమా ఓపెనింగ్స్ కు రావడం ప్రారంభించింది. సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే ప్రమోషన్స్ చేద్దాం సరే అంటోంది.
ముందుగా మూకుతి అమ్మన్ సీక్వెల్ ప్రారంభం కోసం వెళ్లింది నయన్. అప్పుడే తమిళనాట నయన్ లో వచ్చిన మార్పు గురించి చర్చ మొదలైంది. ఇప్పుడు చిరు చిత్రం కోసం రావి పూడి అడగ్గానే డేట్స్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఇంట్రడక్షన్ వీడియో కూడా చేసింది. ఇలా ఎందుకు అంటే గతంతో పోలిస్తే నయన్ మార్కెట్ పడిపోయింది. 2022 నుంచి ఆమెకు సరైన హిట్ లేదు. పైగా పెళ్లి వీడియోతో, ధనుష్ తో పెట్టుకున్న గొడవ కూడా కొంత డ్యామేజీ చేసింది. ఈ దశలో మారకపోతే కష్టం అనుకోని, కొత్త తరం కథానాయికలకు అవకాశాలు వెళ్లడం ఇష్టంలేని నయన్ , మారిపోయింది. అదిదా స్టోరీ.