
రంభ ఈ పేరు చెబితే తెలియని, తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉండడు. ఒకప్పుడు తెలుగు తెరను ఏలిన, డ్రీమ్ గర్ల్ రంభ.
ముఖ్యంగా మెగాస్టార్ తో పోటీ పడుతూ రంభ వేసిన స్టెప్పులకు, ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఒక హిట్లర్, ఒక బావగారు బాగున్నారా లాంటి చిత్రాలు, రంభ ఇమేజ్ ను ఎక్కడికో తెసుకెళ్లాయి. ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఆ ఒక్కటి అడక్కు అనే మూవీతో,
తెలుగు తెరకు పరిచయం అయింది రంభ, ఆ తర్వాత పాన్ ఇండియా వైడ్ గా అన్ని ఇండస్ట్రీస్ లోనూ నటించి మెప్పించింది. 90ల్లో అయితే బాక్సాఫీస్ క్వీన్ గా వెలిగింది. అప్పుడే హీరోలుగా నిలబడుతున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఎన్టీఆర్ తో నాగ,యమదొంగ లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇక దేశముదురులో బన్నితో అదిరిపోయే స్టెప్పులేంది.
2010లో ఓ బిజినెస్ మెన్ ను పెళ్లాడింది. ఆ తర్వాత బిగ్ స్క్రీన్ కు దూరమైంది. కెనడాలో సెటిల్ అయింది. తన పిల్లల ఆలనా పాలనా చూసుకుంది.బాబు వయసు ఏళ్లు, కుమార్తెలు ఉన్నారు. వాళ్లు 14, 10 ఏళ్లు ఉన్నాయట. వాళ్లను చూసుకోవడం కోసమే ఇన్నాళ్లు ముఖానికి మేకప్ కు దూరమైంది రంభ. కాని ఇప్పుడు రంభ మనసు మారింది. తన భర్త ప్రోత్సాహంతో తిరిగి సినిమాల్లో నటించాలనుకుంటోంది. అందుకోసం ముందుగా రియాలిటీ షోస్ కు జడ్జ్ గా వెళ్తోంది. తనతో పాటు నటించిన హీరోలు, హీరోయిన్స్ అందరూ ఇప్పటికీ ఫిల్మ్ కెరీర్ కొనసాగిస్తున్నారు. ఆమని, ఇంద్రజ.. ఇలా.. అందుకే రంభ కూడా రీఎంట్రీకి రెడీ అవుతోంది.
అలా అని చెప్పి, ఏ పాత్ర అంటే ఆ పాత్ర కాకుండా కమ్ బ్యాక్ టెర్రిఫిక్ గా ఉండాలి అంటోంది. 15 ఏళ్లు తెరకు దూరమైనా, ప్రేక్షకులు ఇంకా తనని స్టార్ హీరోయిన్ గా చూస్తుండటం ఆనందాన్ని కలిగిస్తోందని చెబుతోంది రంభ.
అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ తో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో రంభ ఏమైనా మెరుపులు మెరిపిస్తుందా అనేది చూడాల్సి ఉంది.