పెద్ది తర్వాత రామ్ చరణ్ లెక్క ప్రకారం సుకుమార్ తో మూవీ చేయాలి. నిజానికి పుష్ప-2 తర్వాత ఇమిడియెట్ గా వీరిద్దరి ప్రాజెక్ట్ పట్టాలెక్కాల్సి ఉండగా, మధ్యలో బుచ్చిబాబు వచ్చి పెద్ది కోసం చరణ్ దగ్గర డేట్స్ పట్టేశాడు. ఇప్పుడు పెద్ది తర్వాత సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం చేయాలి అనుకుంటుండగా, మధ్యలోకి త్రివిక్రమ్ వచ్చాడు అనేది టాక్. గుంటూరు కారం తర్వాత  అల్లు అర్జున్ కోసం అంటూ స్టోరీ రాస్తూ కూర్చున్నాడు త్రివిక్రమ్. కాని అల్లు అర్జున్ వెళ్లి తమిళ దర్శకుడు అట్లీతో పాన్ ఇండియా మూవీ లాక్ చేసుకున్నాడు. ఇప్పుడప్పుడే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలా లేదు. అందుకే త్రివిక్రమ్ ఇప్పుడు చరణ్ కోసం కథను రెడీ చేస్తున్నాడట.

అలా రెడీ చేయమని చెప్పింది ఎవరో కూదా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్.  నిజానికి కల్యాణ్ కోసం త్రివిక్రమ్ ఒక కథను రెడీ చేసాడట. కాని ఆ కథను రామ్ చరణ్ తో తెరకెక్కించాల్సిందిగా పవన్ కోరాడట. పవన్ చెబితే ఏదైనా చేస్తాడు త్రివిక్రమ్. గతంలో పవన్ చెబితేనే నితిన్ తో సినిమా చేసాడు త్రివిక్రమ్. ఇప్పుడు హిస్టరీ రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి
error: Content is protected !!