హిందీ సినీ ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు ఆమిర్ ఖాన్ మూ డు దశాబ్ధాలకు పైగా తన దైన నటనతో , ప్రతి తరంలోనూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. బాలీవుడ్ కు గజినితో తొలిసారి వంద కోట్లు అందించిన హీరో ఆమిర్ ఖాన్. ఆ తర్వాత ధూమ్ 3, పీకే, 3 ఇడియెట్స్, దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ లాంటి చిత్రాలతో, హిందీ ఇండస్ట్రీ స్థాయిని చైనా వరకు తీసుకెళ్లాడు. ఇండియాలోనే బెస్ట్ యాక్టర్.

అలాంటి నటుడు గతంలో ఎప్పుడో ఒకసారి టర్కి వెళ్లి, అక్కడ నాయకులతో ఫోటోలు దిగినంత మాత్రానా, ఇప్పుడు ఆయన నటించిన కొత్త చిత్రం సితారే జమీన్ పర్ ను ఇండియాలో బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొదలుపెట్టారు. టర్కీ కష్టాల్లో ఉన్న సమయంలో మనం ఆపరేషన్ దోస్త్ అంటూ వారికి సాయం అందించాం. కాని పెహల్గాం ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపడితే , ఆ సమయంలో పాక్ కు టర్కీ డ్రోన్స్ అందించింది. మనపై ఆ డ్రోన్ల్ దాడి ఎలా చేయాలో కూడా వారికి నేర్పింది. అలాంటి దేశంతో ఇప్పుడు దోస్తీ కుదరదని భారతీయుల భావన. ఇది బాగుంది కాని మధ్య ఆమిర్ ఖాన్ ఏం చేసాడు.

కేవలం టర్కీ నేతలను కలవడం అతను చేసిన తప్పా.. భారత దేశం తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ కుటుంబానికి చెందిన వాడు, దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతాడా… పైగా భారత్ నుంచి అత్యున్నతనమైన పురస్కారాలను అందుకున్నాడు.

ఇదంతా కూడా నెటిజెన్స్ తొందరపాటుగా చెప్పుకోవాల్సి వస్తుంది. మూడేళ్ల క్రితం ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చెద్దా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు సితార జమీన్ పర్ మూవీతో తిరిగొస్తున్నాడు. జూన్ 20న ఈ చిత్రం విడుదల కానుంది.

error: Content is protected !!