
ఎంపురాన్ తర్వాత మోహన్ లాల్, మరోసారి మళయాల బాక్సాఫీస్ ను షేక్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న తుడరుమ్, 25 రోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టిందో తెలుసా.. అక్షరాలా 222 కోట్లు. ఇందులో కేరళ నుంచే 110 కోట్లు వచ్చాయి. ఇక రెస్టాఫ్ ఇండియా నుంచి 20 కోట్ల మేర వసూళ్లు అందాయి. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఏకంగా 90 కోట్లకు పైగా వసూళ్లు కురిసాయి. మొత్తంగా 222 కోట్ల వసూళ్ల మార్క్ ను దాటింది తుడరుమ్. మలయాళ సినీ ఇండస్ట్రీలో అంటే కేరళ రాష్ట్రంలో వంద కోట్లు దాటిన తొలి చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది తుడరుమ్.
