
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి గురించి తెలియని తెలుగు వారు ఉండరు. పేరుకే మలయాళ నటుడు కాని, ప్రపంచమంతా మమ్ముట్టికి అభిమానులు ఉన్నారు. ఈ మధ్యే తెలుగులో యాత్ర సిరీస్ లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో జీవించి మెప్పించారు. ఇప్పుడు ఈ లెజెండరీ యాక్టర్ సీవియర్ హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నారని, కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. కొన్ని వెబ్ సైట్స్, మరికొన్ని ఎక్స్ హ్యాండిల్స్ అయితే క్యాన్సర్ కు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని చెప్పుకొస్తున్నాయి.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, మమ్ముట్టి సన్నిహితులు చెప్పుకొచ్చారు. రంజాన్ మాసం కావడంతో మమ్ముట్టి ప్రస్తుతం విదేశాల్లో వెకేషన్ లో ఉన్నారని, తిరిగొచ్చిన తర్వాత మోహన్ లాల్ తో కలసి మల్టీస్టారర్ మూవీలో నటిస్తారని చెప్పుకొస్తున్నాయి. అయితే ఇదే సమయంలో మమ్ముట్టి స్నేహితుడు మోహల్ లాల్ శబరిమల సందర్శించాడు. మమ్ముట్టి పేరు మీద పూజలు చేయించాడని మాలీవుడ్ మీడియా చెప్పుకొస్తోంది.
ఇన్నాళ్లలో లేనిది ఇప్పుడు మోహన్ లాల్ ఇలా ఎందుకు చేసాడు అంటే, తాను నటిస్తోన్న కొత్త సినిమా ఎంపురాన్ -2 రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అందుకే లాల్ పూజలో తన కుటుంబ సభ్యుల పేర్లతో పాటు, తన ప్రాణ స్నేహితుడి పేరు కూడా చెప్పాడని చెబుతున్నారు. ఏది ఏమైనా మమ్ముట్టి ఆరోగ్యంపై పుట్టుకొస్తోన్న పుకార్లతో అభిమానులు కలవరానికి గురవుతున్నారు.