
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. దాయాది దేశంలోని ఉగ్రస్థావరాల లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేస్తోంది. పాక్ ప్రతి కుట్రను తిప్పికొడుతోంది.
ఇదే సమయంలో సైన్యానికి దేశ ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో మన సైన్యం ప్రదర్శించే ధైర్య సాహసాల వల్లే ప్రజలు సురక్షింతంగా ఉంటున్నారని, అందుకే 7.5 లక్షల ట్రక్కులు అంటే వాహనాలను సైన్యానికి అందిస్తామని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్ పోర్ట్ కాంగ్రెస్ ముందుకొచ్చింది. మధ్యప్రదేశ్ లో రిజిస్టర్ అయిన 7.5 లక్షల ట్రక్కులను అందిస్తామని ప్రధాని కార్యాలయానికి లేఖ రాసింది ఏఐఎంటీసీ. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో సుమారు వెయ్యి ట్రక్కులను మోవ్ లోని ఆర్మీ కంటోన్మెంట్ కు అప్పగించింది ఏఐఎంటీసీ