
ఎర్రటి ఎండలను తట్టుకోలేకపోతున్నారా.. ఉక్కపోతతో విసిగిపోతున్నారా.. బయటికి వెళ్లాలంటే భయపడిపోతున్నారా. .నాలుగు జల్లులు పడితే బాగుండు అనుకుంటున్నారా.. అయితే అందుకు ఇంకా చాలా సమయం ఉంది అనుకుంటూ.. మీలో మీరు అడ్జెస్ట్ అయిపోతున్నారా.. అయితే మీరందరికి గుడ్ న్యూస్. చల్లని కబురు అప్పుడే వచ్చేసింది. ఎందుకంటే మంగళవార మధ్యాహ్నం మే అండమాన్ ను తాకాయి రుతుపవనాలు.
రుతుపవనాలు ఎంట్రీతో ఆల్రెడీ గత రెండు రోజులుగా నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులంటితో పాటు దక్షిణ అరేబియా సముద్రం , బంగాళాఖాతం మధ్య వరకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లండించింది. మే 27 నాటికే ఈసారి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తాయి. ఈసారి మాత్రం అంతకంటే ముందుగానే వచ్చేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తానికి వేసవి తాపానికి విలవిల్లాడుతున్న ప్రజలకు, అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు వార్త,గొప్ప రిలీఫ్ అనే చెప్పాలి.