
జమ్మూ కశ్మీర్ లో లష్కరే ఉగ్ర ముఠాకు అనుబంధంగా ఉన్న సంస్థే.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్. ఏప్రిల్ 22న పహల్గాం దాడికి పాల్పడింది ఈ ఉగ్ర సంస్థే.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన ఉగ్ర సంస్థ ఇది. నిజానికి ది రెసిస్టెన్స్ ఫ్రెంట్ ను భారత్ గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఆన్ లైన్ ద్వారా యువతను ఆకర్షించి ఉగ్ర కార్యకలాపాల్లోకి లాగుతోంది.ఆయుధ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా లాంటి పనులు చేస్తోంది.
ముఖ్యంగా జమ్మూ కశ్మీర్ ప్రజల్లో భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాదంలో చేరేలా సోషల్ మీడియా ప్రభావం చూపిస్తోంది. భద్రతా దళ సభ్యుల హత్యకు కుట్రలు పన్నుతోందని చెప్పి భారత్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఐరాస కూడా ది రెస్టిస్టెన్స్ ఫ్రెంట్ ను అంతర్జాతీయ ఉగ్ర సంస్థల జాబితాలో చేర్చాలని భారత్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఇందుకో భారత్ నుంచి ఓ ప్రతినిధుల బృందం న్యూయార్క్ వెళ్లింది. అక్కడ ఐరాస ప్రతినిధులతో చర్చలు జరుపోతంది.