
భారతీయ సినిమాలో చాలా అరుదుగా జరిగే సంఘటన ఇది. ఒకే బయోపిక్ లో ఇద్దరు స్టార్ హీరోలు నటించాలి అనుకోవడం, ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి మొన్న సడన్ గా ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో రాజమౌళి పర్యవేక్షణలో , వారి అబ్బాయ్ కార్తికేయన నిర్మాణంలో భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ రానుందని న్యూస్ బయటికి వచ్చింది. కొద్ది గంటల్లోనే బాలీవుడ్ కూడా ఇదే బయోపిక్ ఎనౌన్స్ చేసింది.
ఎనౌన్స్ చేసినవాళ్లు మామూలు వాళ్లు కాదు. రాజ్ కుమార్ హిరాణి, ఆమిర్ ఖాన్ కాంబినేషన్ లో ఫాల్కే బయోపిక్ తెరకెక్కనుందట. పైగా ఇదే ఏడాది ఈ బయోపిక్ సెట్స్ పైకి వెళ్లనుందని వాళ్లు చెప్పుకొచ్చారు. హిరాణి, ఆమిర్ కాంబినేషన్ అంటే మామూలు కాంబినేషన్ కాదు. బ్లాక్ బస్టర్స్ కు కేరాఫ్ అడ్రస్. 3 ఇడియెట్స్, పీకే లాంటి చిత్రాలతో వీరిద్దరు సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీగా ఫాల్కే బయోపిక్ ను ఎనౌన్స్ చేసారు.
ఒకే కథ, ఇద్దరు స్టార్ హీరోలు నటించడం ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషన్ సృష్టిస్తోంది.గతంలో భగత్ సింగ్ జీవిత చరిత్ర తెరకెక్కించే విషయంలోనూ ఇలాంటి పోటీనే బాలీవుడ్ లో కనిపించింది. మళ్లీ దాదాసాహెబ్ ఫాల్కే జీవితం గురించి పోటీ మొదలైంది. నిజానికి రాజమౌళి అండ్ అతని టీమ్, ఇటు హిరాణి అండ్ అతని టీమ్ కొన్నేళ్లుగా దాదా సాసెబ్ ఫాల్కే జీవితంపై చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాయి. అందుకు సంబంధించిన రీసెర్చ్ వర్క్ చేస్తున్నాయి. కాకపోతే కమ్యూనిషన్ మిస్ కావడం ఇద్దరు ఒకే ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తూ వచ్చారు. ముందుగా అయితే ఆమిర్ ఖాన్ నటించే ఫాల్కే బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరో వైపు ఎన్టీఆర్ ఫాల్కే బయోపిక్ ఎప్పుడు అనేద బహుశా ఎన్టీఆర్ కూడా చెప్పలేడు. ఎందుకంటే టైగర్ చేతిలో వార్-2, డ్రాగన్, దేవర సీక్వెల్ చిత్రాలు ఉన్నాయి. వీటి మధ్య ఫాల్కే బయోపిక్ నటించినా, ఇప్పటికిప్పుడు అయితే సెట్స్ పైకి వెళ్లే అవకాశం అయితే లేదు.
ఇవి కూడా చదవండి