
కేతిక శర్మకు టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచేసింది. ఒకప్పుడు కృతిశెట్టి, ఆ తర్వాత శ్రీలీల, రీసెంట్ గా మీనాక్షి చౌదరీ లాగే, ఇప్పుడు కేతికకు టాలీవుడ్ లో టైమ్ వచ్చింది. సింగిల్ సినిమా విజయం సాధించడంతో, ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. అర్జెంటుగా అయితే మాస్ రాజా రవితేజ, కేతికకు తన సరసన నటించే ఛాన్స్ ఇచ్చాడు. మాస్ జాతర తర్వాత కిషోర్ తిరుమల మేకింగ్ లో రవితేజ ఒక చిత్రం చేస్తున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం సా గుతోంది. వచ్చే సంక్రాంతి సీజన్ టార్గెట్ గా ఈ సినిమా షూటింగ్ సాగనుంది. అందులో భాగంగా, చిత్ర యూనిట్ కేతికకు ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో అఫీసియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.
2021 లో రొమాంటిక్ మూవీ తో తన ఫిల్మ్ కెరీర్ ను ప్రారంభించింది కేతిక. టాలీవుడ్ తో హీరోయిన్ గా మారి, ఆ తర్వాత టాలీవుడ్ కు మాత్రమే పరిమితం అయింది. మధ్య కోలీవుడ్, బాలీవుడ్ వైపు కూడా చూడలేదు. రంగ రంగ వైభవంగా, బ్రో, రాబిన్ హుడ్ చిత్రాల్లో నటించింది. రాబిన్ హుడ్ లో అదిదా సర్ ప్రైజ్ కేతికకు కావాల్సినంత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత శ్రీవిష్ణుకు జోడిగా నటించిన సింగిల్ కూడా సూపర్ హిట్ కావడంతో, కేతికకు టాలీవుడ్ ఎంకరేజ్ చేద్దామని ఫిక్స్ అయింది.