
ఇండియాలో అతి పెద్ద ఫిల్మ్ స్టార్స్ లో ఒకరు సల్మాన్ ఖాన్. రీసెంట్ గా సికందర్ అనే చిత్రాన్ని విడుదల చేసాడు. ప్రస్తుతం తన కెరీర్ లో ఎన్నడూ చేయని పాత్ర చేయబోతున్నాడు. 2020 జూన్ 15న గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల ఘర్షణ పడ్డారు. ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఈ పోరులో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబు సహా 20 మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘటనతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. కర్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని భారత్ సైనికులు చూపిన తెగువ, బలిదానాన్ని దేశం ఎన్నటికి మురవుదు.

ఈ బలిదానం ఇప్పుడు వెండితెరకెక్కేనుంది. కోట్లాది భారతీయులకు అసలు ఆ రోజు ఏం జరగనుంది అనేది తెలియనుంది. బాలీవుడ్ హీలో సల్మాన్ ఖాన్ , కర్నల్ సంతోష్ బాబుగా నటించేందుకు సిద్ధమవుతున్నాడు. జులై నుంచే షూటింగ్ ప్రారంభం కానుంది. అపూర్వ లాఘియా దర్శకత్వంలో చిత్రం తెరకెక్కనుంది.
ఇవి కూడా చదవండి