తమిళ దిగ్గజ దర్శకుడు మణిరత్నం, తెలుగు హీరో నవీన్ పొలిశెట్టి కాంబినేషన్, ప్రస్తుతం సౌత్ ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎలా చూసినా ఈ కాంబినేషన్ చాలా విచిత్రంగా ఉంది. ఒక వైపు నవీన్ పొలిశెట్టి లాంటి అల్లరోడు, మరో వైపు దేశంలోనే దిగ్గజ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మణిరత్నం. వీరిద్దరు కలసి ఒక ప్రేమకథను ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేది ఆశక్తికరంగా మారంది. నిముషం కూడా కుదరు ఉండని పాత్రలకు, కామెడీ క్యారెక్టర్స్ కు , ఫన్ కు, పంచ్ లకు నవీన్ పొలిశెట్టి కేరాఫ్ అడ్రస్.

ఇక మణిరత్నం గురించి చెప్పేది ఏముంది,  ఆయన తీసిన తీస్తోన్న మూవీస్ గురించి మాట్లాడుకునేది ఏముంది.. అలాంటి దర్శకుడు తగ్ లైఫ్ లాంటి భారీ చిత్రం తర్వాత, డైరెక్ట్ గా పొలిశెట్టి దగ్గరికి వచ్చి తెలుగు, తమిళ బైలింగువల్ మూవీ తెరకెక్కిస్తానంటున్నాడు. జాతిరత్నాలు హీరోతో, గీతాంజలి డైరెక్టర్ మణిరత్నం ఏం ప్లాన్ చేస్తున్నాడు అనేది చూడాల్సిఉంది. అన్నట్లు మరో విషయం ఎప్పుడో 1989 లో వచ్చిన మణిరత్నం తెలుగు హీరో నాగార్జునతో గీతాంజలి చిత్రం తెరకెక్కించాడు. ఆతర్వాత ఈ సినిమా కల్ట్ క్లాసిక్ గా మారింది. మళ్లీ ఇన్నాళ్లకు ఓ తెలుగు హీరోను మణిరత్నం డైరెక్ట్ చేయబోతున్నాడు. నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం అనగనగా ఒక రాజు చిత్రంలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!