ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా, ట్రావెల్ విత్ జో పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించింది. గూఢచర్యం ఆరోపణల కింద గత వారం జ్యోతిని, హరియాణా పోలీసులు అరెస్ట్ చేసారు. పహల్గాం ఘనటకు ముందు, జ్యోతి ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ వీడియో తీసింది. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీని పైనే పోలీసులు లోతుగా దర్యాప్తు  చేస్తున్నారు. కేసు విచారణలో పలు కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

విచారణ సమయంలో జ్యోతి మొఖంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదట. పాకిస్థాన్ కు అనుకూలంగా భారత్ ప్రచారం చేయాలని, ఇదో కొత్త తరహా యుద్ధం అని ఆమె పోలీసులకు చెబుతున్నట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కూడా ఆమె యూట్యూబ్ లో ఒక వీడియోలో ఇటువంటి ప్రకటనే చేసింది. ఆ ఘనట, ఆ ఉగ్ర ఘటనకు ఏ పాకిస్థాన్ వ్యక్తి తప్పులేదని ఆందులో చెప్పుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. జ్యోతికి పరిచయం ఉన్న కొందకు పాకిస్థాన్ వ్యక్తులు, ఆమెకు మరికొన్ని బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు.

ఆపరేషన్ సిందూర్  ఆనంతరం కూడా జ్యోతి ఢిల్లోని పాక్ రాయబార కార్యాలయంలోని అధికారులతో టచ్ లో ఉందని అధికారులు ధృవీకరించారు. జ్యోతి పాక్ రాయబారి ట్రాప్ లో పడి ఉంటుందని తెలుస్తోంది. పాక్ తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్ వర్క్ ను అధికారులు ఛేదిస్తూ వెళ్తున్నారు. రెండు వారాల వ్యవధిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. వీరు పాక్ నిఘా వర్గాలకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు ఇప్పటి వరకు చేపట్టిన విచారణలో తేలిందని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి
error: Content is protected !!