భారతీయ సినిమా పితామహుడు, దాదా సాహెబ్ ఫాల్కే జీవితంపై, బయోపిక్ తెరకెక్కించాలి అనుకున్నాడు రాజమౌళి.అందుకు తగ్గట్లే రెండేళ్ల క్రితమే మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసాడు.తన తనయుడు కార్తికేయ, మరికొందరికి ఈ బాధ్యతలు అప్పగించాడు. అదే స్పీడ్ లో దాదా సాహెబ్ ఫాల్కే జీవితంపై బయోపిక్ తీయాలి అనుకున్నారు. అట్టహాసంగా అయితే ఎనౌన్స్ మెంట్ చేసారు కాని, ఫాల్కే బయోపిక్ పై రీసెర్చ్ వర్క్ లేదా వారి కుటుంబం నుంచి బయోపిక్ తెరకెక్కించేందుకు పర్మిషన్స్ రాజమౌళి టీమ్ తీసుకోవడంలో వెనుకపడింది.

దీంతో ఇప్పుడు ఈ బయోపిక్ డేంజర్ లో పడింది. ఎందుకంటే హిందీలో ఫాల్కే బయోపిక్ ను తెరకెక్కించేందుకు మూడేళ్లుగా శ్రమిస్తున్నాడు ఆమిర్ ఖాన్. అలాగే అతని దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి. పైగా ఫాల్కే మనవడితో బయోపిక్ ను గత కొన్ని నెలలుగా టచ్ లో ఉన్నారు. ఈ విషయాన్ని అతని మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ చెప్పుకొచ్చాడు. ఒక బయోపిక్ తెరకెక్కించాలి అంటే వారి కుటుంబ సభ్యుల పర్మిషన్ కంపల్సరీ.  లేదా సెన్సార్ సర్టిఫికేషన్స్ చాలా ఇబ్బంది కరంగా మారుతుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ ను రాజమౌళి విరమించుకునే అవకాశాలు ఉన్నాయి.

తన కెరీర్ మొత్తంలో ఎలాంటి వివాదాలు లేవు. సో ఇప్పుడు బలవంతంగా ఫాల్కే బయోపిక్ తెరకెక్కించి, ఆమిర్ పోటీగా రాజమౌళి మరో సినిమా తీసే అవకాశాలు అయితే లేవు. అసలు ఆమిర్, హిరాణి ఫాల్కే బయోపిక్ పై కసరత్తులు చేస్తున్నారని రాజమౌళికి ఏమాత్రం తెల్సినా… తన వైపు నుంచి ఎనౌన్స్ మెంట్ వచ్చి ఉండేది కాదు అనేది సన్నిహితులు చెప్పుకొస్తున్న మాట. ఏది ఏమైనా ఎన్టీఆర్ చేయాల్సిన ఒక సినిమాకు మాత్రం బ్రేక్ పడింది. ఇది ఎన్టీఆర్, అలాగే రాజమౌళి అభిమానులకు కాస్త చేదు వార్త.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి

error: Content is protected !!