తమిళ నటుడు ధనుష్ స్పీడ్ మామూలుగా లేదు. దేశంలోనే తిరుగులేని నటుడిగా పేరు తెచ్చుకున్నాడు ధనుష్. అందుకే ఏ పాత్రలో కైనా ఇట్టే ప్రవేశిస్తాడు. ఆ కాన్ఫిడెన్స్ తోనే, ఎవరూ డేర్ చేయాని క్యారెక్టర్స్  చేస్తూ వస్తున్నాడు. అందులో ఒకటి ఇళయరాజా బయోపిక్. చాలా కాలం క్రితమే ఈ బయోపిక్ ను ఎనౌన్స్ చేసాడు ధనుష్. ఆ తర్వాత సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కాలం బయోపిక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పైగా ఈ చిత్రాన్ని హిందీ దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.

అతను ఎవరో కాదు ఆదిపురుష్ తీసి, దేశ వ్యాప్త్తంగా ప్రజల నుంచి చివాట్లు తిన్న మేకర్ ఓం రౌత్. నిజానికి ఓం రౌత్ మంచి మేకర్, అంతుకు ముందు తానాజీ తీసి బాలీవుడ్ కు అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అయితే ఆదిపురుష్ తీసి చేతులు కాల్చుకున్నాడు. కొంత సమయం తర్వాత ఇప్పుడు అబ్దుల్ కలాం బయోపిక్ ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో ధనుష్ హీరోగా నటించబోతున్నాడు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మేకర్స్ ఈ ప్రాజెక్ట్ గురించి రివీల్ చేసారు. అంతే కాదు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసారు. సినిమా పేరు కలాం. ఇక ధనుష్ ప్రస్తుతం కుబేర చిత్రం విడుదలకు సన్నాహాలు
జరుపుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి

error: Content is protected !!