
ఎన్నడూ లేనిది థియేటర్ తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు అంతా కలసి, జూన్ 1న థియేటర్స్ బంద్ కు పిలుపు నివ్వడం, మల్టిప్లెక్సులు తరహాలో తమకూ పర్సంటేజీ కావాలని సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్స్ అడుతున్నారు అంటే… అక్కడ సమస్య ఉందని, అది నిజంగానే పెద్ద సమస్య ఏమో అన్నట్లు అందరూ ఊహించారు.
ఇంతలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు విడివిడిగా మీటింగ్ పెట్టారు. దాంతో సమస్య చాలా తీవ్రంగా ఉంది అన్నట్లు బిల్డప్ ఇచ్చారు. చివరికి ఎటూ తెల్చకుండా వెళ్లిపోయారు. అయితే ఇదంతా కూడా కావాలని చేస్తున్నదే అని ఎవరూ గ్రహించలేకపోయారు.
సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటిస్తోన్న కొత్త చిత్రం హరిహర వీరమల్లు మూవీ జూన్ 12న ఉంది. ఈ సినిమాను అడ్డుకునేందుకు ఎగ్జిబిటర్లను కొందరు ( ముఖ్యంగా ఆ నలుగురు) రెచ్చగొచ్చారని ఇప్పుడు బయటికి వస్తోన్న సమాచారం. దీంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండు రాష్ట్రాల్లో హాళ్లను .. ఆ నలుగురు అనే వ్యక్తులు కొన్నేళ్లుగా తమ చేతుల్లో పెట్టుకున్నారు అనేది అందరికి తెల్సిన విషయమే. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆ నలుగురు మాత్రమే శాసిస్తున్నారని, గత కొన్ని ఏళ్లుగా ప్రచారం సాగుతోంది. దాసరి అంతటి వారు బ్రతికున్నంత కాలం చెప్పుకొస్తూనే ఉన్నారు. ఆ నలుగురు నిర్మించిన సినిమాలు విడుదలైనప్పుడు, పరిశ్రమలో ఎలాంటి అడ్డంకులు రాకుండా జాగ్రత్త పడతారు. అదే వారికి నచ్చని హీరో, నిర్మాత సినిమాను రిలీజ్ అవుతున్నప్పుడు, సినీ పరిశ్రమలో ఏదో జరిగిపోతుంది అన్నట్లు పెద్ద సమస్యను తీసుకొచ్చి ఇండస్ట్రీని షేక్ చేసి పారేస్తారు.
పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, తెలుగు సినీ పరిశ్రమ ఎదుగుదల, సమస్య పరిష్కారం కోసం తనవంతుగా కొన్ని చర్యలు చేపట్టారు. ఇదే విషయమై సినీ నిర్మాతలతో చర్చలు కూడా జరిపారు. వాళ్లు ఎంత అడిగితే అంతా టికెట్ల రేట్లు పెంచారు.
ఇప్పుడు పవన్ కల్యాణ్ చిత్రం, హరి హర వీరమల్లు జూన్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. భీమ్లా నాయక్ తర్వాత పవన్ నటించిన చిత్రం ఇది. పవన్ కు అత్యంత ఆప్తుడు ఏ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహిస్తున్నారు. ఆయన పవన్ కల్యాణ్ కోసమే, ఈ సినిమాను ఎన్నో సార్లు విడుదల వాయిదా వేసారు. అలాంటి వ్యక్తి సినిమాను, పైగా పవన్ కల్యాణ్ నటిస్తోన్న మొదటి ప్యాన్ ఇండియా చిత్రాన్ని, ఆ నలుగురు కలసి సరిగ్గా విడుదల సమయానికి థియేటర్స్ బంద్ సమస్యను తెచ్చిపెట్టారు. దీన్ని పవన్ కు వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నిస్తున్నారని అనకపోతే ఏం అంటారు అంటున్నారు పవన్ ఫ్యాన్స్.
జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్న అంశంపై, విచారణ చేపట్టాలని ఈ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారో తెల్సుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శికి ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖల మంత్రి కందుల దుల్గేశ్ ఆదేశించారు. ఈ వివాదం ఏ మలుపు తిరిగుతుందు చూడాల్సి ఉంది.
ఇది కూడా చదవండి
ఇది కూడా చదవండి
ఇది కూడా చదవండి
ఇది కూడా చదవండి
ఇది కూడా చదవండి
ఇది కూడా చదవండి