గత ఏడాది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలను అందుకుని, ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించి ఓరిజినల్ గేమ్ ఛేంజర్ అనిపించుకున్నాడు పవన్ కళ్యాణ్. 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఒక్క ఎన్నికలో జరిగిన అద్భుతం కాదు ఇది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొన్నేళ్ల పాటు రక్తం ధారపోసి నిర్మించిన జనసేన పార్టీని, ప్రజలు అందలం ఎక్కించడానికి దశాబ్ధ కాలం పట్టింది. అంతకు ముందు ప్రజారాజ్యం అనే ఫెయిల్యూర్ పార్టీ నేపథ్యం ఉంది. అన్ని దాటుకుని పవన్ గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసారు. అలాంటి ఓరిజినల్ గేమ్ ఛేంజర్ ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా నటించిన కొత్త చిత్రం గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేస్తున్నారు. జనవరి 4న రాజమహేంద్రవరంలో జరిగే ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ ముఖ్య అతిథిగా వెళ్తున్నాడు. చాలా కాలం తర్వాత మెగా హీరోలు ఒకే వేదికపైకి వస్తుండటంతో, అభిమానులు కళ్లలో వత్తులేసుకుని ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. గేమ్ ఛేంజర్ గురించి ఓరిజినల్ గేమ్ ఛేంజర్ ఏం చెబుతారు అనేది, ఇప్పుడు ఆశక్తికరంగా మారింది.

error: Content is protected !!