అన్ని శ్వాస కోశ ఇన్ఫెక్షన్లపై సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరికైనా దగ్గు, జలుబు ఉంటే ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి వారు, ఇతరులతో కాంటాక్ట్ కాకుండా ఉండాలని గోయల్ కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు ఆయన. చైనాలో హెచ్ ఎం పీవీ వ్యాప్తిపై ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోసారి చైనా ఏ ముప్పు తెచ్చిపెడుతుందని భయపడిపోతున్నారు. ఈ దశలో గత కొన్నివారాలుగా చైనాలో శ్వాస కోశ వ్యాధులు పెరుగుతుండటం, ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితి అదుపులో ఉందని చైనా చెబుతున్నా, ఎక్కడో ఏదో జరుగుతోందని అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ దశలో భారత్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ పై అప్రమత్తమైంది. డీజీహెచ్ ఎస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల సమావేశం జరిగింది. ఢిల్లీలో జరిగిన ఈ భేటిలో పలు విభాగాల అధికారులు, ఆసుపత్రులకు చెందిన వైద్య నిపుణులు కూడా పాల్గొన్నారు. సాధాణంగా వచ్చే జలుబుకు కారణమయ్యే హెచ్ ఎం పీవీ ఉందని డీజీ హెచ్ ఎస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ అన్నారు. అయితే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్నిటికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించినప్పటికీ,

జలుబు, జ్వరానికి అవసరమైన మందులు మాత్రం తప్పక వాడాలని వెల్లడించింది. ఇతరులతో కాంటాక్ట్ కావోదని గోయల్ సూచించారు. చైనాలో పరిస్థితులపై క్రమం తప్పకుండా అప్ డేట్స్ షేర్ చేయాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. చైనాలో హెచ్ ఎం పీవీ వేగంగా వ్యాప్తి చెందుతోందనన్న వార్తలపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్ లోని ఫీవర్, గాంధీ, ఉస్మానియా, రాంకోఠి , వంటి ప్రధాన ఆసుపత్రులలో , అన్ని జిల్లాల్లో ప్రధాన ఆసుపత్రులను అప్రమత్తం చేసింది.

అదే సమయంలో అనారోగ్యంతో ఉన్న వారు కరోనా కాలం నాటి పద్ధతులను పాటించాలని కోరింది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మాస్క్ తో కప్పుకోవాలి. చేతులు తరచూ సబ్బుతో కడగాలి. రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. పుష్కలంగా నీరు తాగాలి. పౌష్టిక ఆహారం స్వీకరించాలి. కంటినిండా నిద్రపోవాలి. జ్వరం, దగ్గు, తుమ్ములు ఉంటే బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మార్గదర్శకాలు సూచించింది.

error: Content is protected !!