
pic source – X
ఇదేదో మీకు ఉద్యోగం కల్పించేందుకు అందించిన ప్రకటన కాదు.ఇది నిజంగానే జరిగింది. పేస్టులు, మౌత్ వాష్ లు వచ్చిన కాలంలో, ఇంకా ఎవరండి ఈ వేప పుల్లలు వాడేది అని తీసి పడేయకండి.ఎక్కడ అమ్మాలో అక్కడ అమ్మితే, డబ్బులు సంపాదించవచ్చు, ఈ విషయాన్ని మహా కుంభమేళాలో వేప పుల్లలు అమ్మిన ఒక వ్యక్తి ప్రూవ్ చేసాడు. కోట్ల మంది హాజరయ్యే కుంభమేళా లాంటి ఆధ్యాత్మిక వేడుకలో, ప్రతి ఒక్కరికి తప్పని సరిగా అవసరం అయ్యేది అంటే, వేప పుల్ల అని ఒక వ్యక్తి అంచనా వేసాడు. వెంటనే కొన్ని వేప పుల్లలను, సేకరించి, మహాకుంభమేళాలో అమ్మడం మొదలు పెట్టారు.
ప్రయాగ్ రాజ్ కు వచ్చే భక్తులు, సాధువులు అందరి దగ్గరికి వెళ్లి పుల్ల పది రూపాయలకు అమ్మాడు అంట. ఇంకేముంది రోజుకు పది వేలకు పైగానే సంపాదన అందుకున్నాడట. మొత్తంగా నాలుగైదు రోజుల్లోనే 50 వేలకు సంపాదన దాటింది. ప్రస్తుతం ఈ వేప పుల్ల వ్యాపార వేత్తను అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే తనది కాదని, తన ప్రియురాలిదని, క్రెడిట్ మొత్తం ఆమెకు దక్కుతుందని చెబుతున్నాడట. ప్రతి మగాడి విజయం వెనుక స్త్రీ ఉందని మరోసారి ఈ సక్సెస్ స్టోరీ ప్రూవ్ చేసిందని చెప్పవచ్చు.