తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది.. అతనో చరిత్ర. సినిమాలైనా, రాజకీయాలైనా, పవన్ ముద్ర తిరుగులేని, చరిత్ర మరువలేనిది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్నాడు పవన్ కల్యాణ్. ఈ దశలో పవన్ సినిమాలపై ఫోకస్ పెట్టలేకపోతున్నారు. దాంతో చేతిలో ఉన్న చిత్రాలను పూర్తి చేసి, పూర్తిస్థాయి పొలిటీషియన్ గా కొనసాగాలి అనుకుంటున్నాడు. పైగా తరచూ అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దాంతో ఇక సినిమాలను పూర్తి చేసి నిర్మాతలకు భారం తగ్గించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.

ఇటీవలే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలను పిలిచి పవన్ మాట్లాడినట్లు తెలుస్తోంది. జులై నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ కు డేట్స్ ఇవ్వబోతున్నట్లు తెలిపారట. ఈలోపు చేతిలో ఉన్న హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాలను పూర్తి చేయాలనుకుంటున్నాడట. హరీష్ శంకర్ మేకింగ్ లో పవన్ నటించే ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ స్టార్ కెరీర్ లో చివరి చిత్రంలో కానుందని సమాచారం.

అదే నిజమైతే పవర్ స్టార్ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ కావడం ఖాయం. ఎందుకంటే పవన్ తెరపై చూడటం కంటే అంతకు మించిన అనుభూతి మరొకటి ఉండదు అంటారు అభిమానులు. కాని ఇప్పుడు తెరకు దూరం కాబోతున్నాడు. వీర మల్లు షూటింగ్ ను త్వరలో పూర్తి చేసి మే లోనే విడుదల చేసేందుకు రెడీ చేయబోతున్నాడు. ఆ తర్వాత ఓజీని కంప్లీట్ చేసి సెప్టెంబర్ 5న విడుదలకు సిద్ధం చేయబోతున్నారట. తమిళంలో వచ్చిన తేరీ మూవీని తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తున్నాడు హరీష్ శంకర్.

error: Content is protected !!