
ఒక్క సినిమా జీవితాన్ని మార్చేస్తుంది అంటే ఏమో అనుకుంటాం కాని, త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ముందుగా ఆచార్యతో డిజాస్టర్ ను చూసిన కొరటాలతో దేవర చేసాడు. ఆ తర్వాత బాలీవుడ్ వరకు వెళ్లి అక్కడ హృతిక్ రోషన్ తో కలసి మల్టీస్టారర్ మూవీ వార్ -2 చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మేకింగ్ లో డ్రాగన్ అనే భారీ చిత్రంలో నటిస్తున్నాడు. వీటి తర్వాత ఇంకా లైన్ లో దేవర సీక్వెల్ ఉంది.

ఇప్పుడు భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా తెరకెక్కే చిత్రంలో నటించబోతున్నాడట. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అయిందనీ, ఎన్టీఆర్ కు బాగా నచ్చిందని, అందుకే డేట్స్ కూడా లాక్ చేసాడని సమాచారం.ఈ తరం భారతీయ నటుల్లో తిరుగులేని నటుడు ఎన్టీఆర్. అలాంటి యాక్టర్ ఇప్పుడు దాదా సాహెబ్ ఫాల్కే పాత్రలో నటించడం అంటే, అది చిన్న విషయం కాదు. సినిమా పై, కళారంగంపై, ఎంతో ప్రేమ , గౌరవం ఉంటే కాని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి సాధ్యపడుదు.