
బాలీవుడ్ నుంచి వస్తోన్న వార్ -2, మెగా పవర్ స్టార్ నటిస్తోన్న పెద్ది, ఇప్పుడు ఇండియా సినిమాలోనే అతి పెద్ద చిత్రాలు. రీసెంట్ గానే వార్ -2 టీజర్ రిలీజ్ అయింది. అంతకుముందు పెద్ది టీజర్ వచ్చింది. ఈ రెండు కూడా ఇప్పుడు సెన్సేషన్ కు మారుపేరుగా మారాయి. అదే సమయంలో ఒకేసారి వర్కింగ్ స్టిల్స్ బయటికి వచ్చాయి.

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పెద్ది టీమ్, ఆన్ లోకేషన్ ఫోటోస్ ను విడుదల చేసింది. వీటిల్లో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు , అలాగే హిందీ నటుడు దివ్యేందు శర్మ ఫోటోస్ లో కనిపించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుకుమార్ సహనిర్మాతగా వ్యవహిస్తున్నాడు. ఇక జగపతి బాబు మరోసారి విలన్ గా నటిస్తోన్నట్లు సమాచారం. జాన్వీ కపూర్ కథానాయిక. రంగస్థలం తర్వాత మరోసారి రామ్ చరణ్ చిత్రానికి విలేజ్ సెట్ వేసారు. అదే ఈ సెట్. ప్రొడక్షన్ డిజైనర్ అవినాశ్ కొల్ల నేతృత్వంలో సెట్ అద్భుతంగా వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఇదే సెట్ లో చిత్రీకరణ జరుగుతోంది.

వచ్చే ఏడాది మార్చి 27న చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ 30 శాతం పూర్తైందని చరణ్ వెల్లడించాడు. అలాగే మీరు సినిమా గురించి ఎంతైనా అంచనాలు పెట్టుకోండి, పెద్ది అంతకు మించి ఉంటుందని కాన్ఫిడెంట్ గా చెప్పాడు. త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ , ఆచార్య, త్రిబుల్ ఆర్ లాంటి డిజాస్టర్స్ చూసాడు.మళ్లీ పెద్ది తో పాన్ ఇండియాకు మెగా కమ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు.

ఇక వార్ -2 టీజర్ రిలీజైన తర్వాత, కొంత నెగిటివ్ టాక్ వచ్చింది. టీజర్ ఇంప్రెస్ చేసే విధంగా అయితే లేదు అనేది నెటిజెన్స్ చెప్పుకొచ్చే మాట. అందుకే చిత్ర యూనిట్ ప్రమోషన్ పై ఫోకస్ పెట్టింది. ఇమిడియెట్ గా ఆన్ లోకేషన్ ఫోటోస్ రిలీజ్ చేసి, వార్ -2 ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసింది. టీజర్ గురించి వదిలేయండి సినిమా స్టోరీ అదిరిపోతుందంటూ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ బాలీవుడ్ మీడియాకు చెప్పుకొచ్చాడు. ఆగస్ట్ 14న ఈ చిత్రం విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి